Flemingo Festival 2025 : అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం, మూడ్రోజుల పాటు 5 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
Flemingo Festival 2025 : ఐదేళ్ల తర్వాత ఏపీలో మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్-2025 ను పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాలలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
(1 / 6)
ఐదేళ్ల తర్వాత ఏపీలో మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్-2025 ను పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ప్రకృతి, సంస్కృతి, జీవవైవిధ్యాల మహోత్సవంగా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాలలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.
(2 / 6)
సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఫ్లెమింగో ఫెస్టివల్ ను శనివారం ప్రాంభించారు.
(3 / 6)
ఫ్లెమింగో ఫెస్టివల్ ను జనవరి 18,19, 20 తేదీల్లో నేలపట్టు, అతికానితిప్ప, సూళ్లూరుపేట, బీవీ పాలెం, శ్రీసిటీలో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తు్న్నారు.
నిపుణులు నేలపట్టు, పులికాట్ సరస్సు ద్వారా టూరిస్టులు పక్షుల సహజ ఆవాసాలలో వలస పక్షులను చూసేందుకు తీసుకెళ్తారు. అలాగే ఈ ఈవెంట్లలో ఏపీ సంప్రదాయ కళారూపాలు, సంగీతం, నృత్యాలను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా ప్రత్యేక రుచులు, సంప్రదాయ వంటకాలను టూరిస్టులు ఆస్వాదించవచ్చు.
(4 / 6)
వన్యప్రాణుల ఫోటోగ్రఫీ పోటీలు, పులికాట్ సరస్సులో బోటింగ్, జీవవైవిధ్యం పరిరక్షణపై ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, శ్రీ సిటీలో సీఎస్ఆర్, టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తారు. చిత్తడి నేలలను సంరక్షించడానికి, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వలస పక్షుల పరిరక్షణను ప్రపంచ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
(5 / 6)
ఈ ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం, పర్యాటకులను ఆకర్షించడం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడు రోజుల్లో సుమారు 6 నుంచి 7లక్షల మంది పర్యాటకులు ఈ ఫెస్టివల్ కు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు