(1 / 7)
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 లేదా 14వ తేదీ నుంచి స్కీమ్ ను ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.
(2 / 7)
ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.
(3 / 7)
అయితే తల్లికి వందనం స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లిదండ్రులు 3 పనులను తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు.
(4 / 7)
ఈ స్కీమ్ రావాలంటే తల్లులతో పాటు వారి పిల్లల వివరాలన్నీ కూడా హౌస్ డేటా బేస్ లో తప్పకుండూ నమోదు చేసుకుని ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని వాళ్లు స్థానిక అధికారులను సంప్రదించవచ్చని చెబుతున్నారు.
(5 / 7)
ఈకైవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. ఇక
బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా NPCIతో లింక్ చేయబడి ఉండాలని చెబుతున్నారు. ఈ మూడు సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు జమవుతాయని చెబుతున్నారు.
(6 / 7)
లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.
(7 / 7)
ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు