AP TG Weather : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, రేపు ఈ జిల్లాల్లో వడగాలులు-ap telangana weather report heatwaves hit these districts tomorrow isolated rains ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, రేపు ఈ జిల్లాల్లో వడగాలులు

AP TG Weather : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, రేపు ఈ జిల్లాల్లో వడగాలులు

Published Apr 13, 2025 07:51 PM IST Bandaru Satyaprasad
Published Apr 13, 2025 07:51 PM IST

AP TG Weather : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలాడుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు(ఏప్రిల్ 14న) ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలాడుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు(ఏప్రిల్ 14న) ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 98 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(1 / 6)

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలాడుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు(ఏప్రిల్ 14న) ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 98 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(image source unsplash.com)

ఏపీలోని కాకినాడ జిల్లాలోని 3 మండలాలు, కోనసీమలోని 7 మండలాలు, తూర్పు గోదావరి గోకవరంతో కలిపి మొత్తం 11 మండలాల్లో తీవ్రవడగాలులు, మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని  ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

(2 / 6)

ఏపీలోని కాకినాడ జిల్లాలోని 3 మండలాలు, కోనసీమలోని 7 మండలాలు, తూర్పు గోదావరి గోకవరంతో కలిపి మొత్తం 11 మండలాల్లో తీవ్రవడగాలులు, మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రేపు(ఏప్రిల్ 14న) శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి,కాకినాడ,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.  భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

(3 / 6)

రేపు(ఏప్రిల్ 14న) శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి,కాకినాడ,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

(PTI)

 ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4°C, 54 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో  54.7 మిమీ, ప్రకాశం కనిగిరిలో 43 మిమీ,అల్లూరి జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిమీ వర్షపాతం నమోదైందన్నారు.

(4 / 6)

ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4°C, 54 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7 మిమీ, ప్రకాశం కనిగిరిలో 43 మిమీ,అల్లూరి జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిమీ వర్షపాతం నమోదైందన్నారు.

(Image Source Pixabay )

తెలంగాణలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 - 3 °C పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

(5 / 6)

తెలంగాణలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 - 3 °C పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

(pixabay)

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

(6 / 6)

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

(PTI)

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు