(1 / 6)
ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఉపశమనం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
(2 / 6)
తెలుగు రాష్ట్రాల్లో నేడు స్కూళ్లకు చివరి వర్కింగ్ డే. రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాలలను రీ ఓపెన్ చేస్తారు.
(3 / 6)
ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో పిల్లలు ఆటల పేరుతో బయట తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్న సమయంలో పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
(4 / 6)
అలాగే వేసవి కావడంతో విద్యార్థులు సాధారణంగా నీటి కుంటలు, కాలువలు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారు. పిల్లలు ఈత కోసం వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు తెలపాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
(5 / 6)
వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా పిల్లలకు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు హెచ్చరించాయి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తగిన ఆదేశాలు జారీ చేశాయి.
ఇతర గ్యాలరీలు