ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ షురూ - త్వరలోనే 'వాట్సాప్'లోనూ సేవలు..!-ap ration services will be available on whatsapp governance soon key updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ షురూ - త్వరలోనే 'వాట్సాప్'లోనూ సేవలు..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ షురూ - త్వరలోనే 'వాట్సాప్'లోనూ సేవలు..!

Published May 07, 2025 01:22 PM IST Maheshwaram Mahendra Chary
Published May 07, 2025 01:22 PM IST

ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ షురూ అయింది. కొత్త కార్డు దరఖాస్తులతో పాటు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్ ఆధారంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి(మే 7) నుంచి నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

(1 / 7)

ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి(మే 7) నుంచి నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించండం మరియు కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

(2 / 7)

నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించండం మరియు కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులో ఉన్న ఈ సేవలు… త్వరలోనే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా కూడా అమలు చేయనున్నారు. ఈ వారం రోజులలోపు వాట్సాప్ గవర్నెన్సు ద్వారా కూడా ఈ సేవలను పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై రేపోమాపో ప్రకటన రానుంది. 9552300009 వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేసి ఈ సేవలు పొందవచ్చు.

(3 / 7)

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులో ఉన్న ఈ సేవలు… త్వరలోనే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా కూడా అమలు చేయనున్నారు. ఈ వారం రోజులలోపు వాట్సాప్ గవర్నెన్సు ద్వారా కూడా ఈ సేవలను పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై రేపోమాపో ప్రకటన రానుంది. 9552300009 వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేసి ఈ సేవలు పొందవచ్చు.

ఏపీలో  మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈకెవైసీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ నిర్ణయంతో  దాదాపు 6,45,765 మందికి ఇకెవైసి చేయలేదని చెప్పారు. ఇప్పటికే 3,94,08,070 మంది తమ రైస్ కార్డులో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకున్నారని వివరించారు.

(4 / 7)

ఏపీలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈకెవైసీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ నిర్ణయంతో దాదాపు 6,45,765 మందికి ఇకెవైసి చేయలేదని చెప్పారు. ఇప్పటికే 3,94,08,070 మంది తమ రైస్ కార్డులో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకున్నారని వివరించారు.

ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్ తో స్మార్టు రైస్ కార్డులను జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయి. ఈ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయి. డాటా బేస్ కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టమ్ లో ఆటో మేటిక్ గా డేటా కూడా అప్డేట్ అవుతుంది.

(5 / 7)

ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్ తో స్మార్టు రైస్ కార్డులను జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయి. ఈ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయి. డాటా బేస్ కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టమ్ లో ఆటో మేటిక్ గా డేటా కూడా అప్డేట్ అవుతుంది.

రాష్ట్రంలో కొత్త కార్డుల జారీకి ఎప్పట్నుంచో కసరత్తు జరుగుతున్నప్పటికీ… ఈకెవైసీ ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యం అయింది.  అయితే ఇప్పటి వరకు 94.4 శాతం మేర ఇకెవైసి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

(6 / 7)

రాష్ట్రంలో కొత్త కార్డుల జారీకి ఎప్పట్నుంచో కసరత్తు జరుగుతున్నప్పటికీ… ఈకెవైసీ ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యం అయింది. అయితే ఇప్పటి వరకు 94.4 శాతం మేర ఇకెవైసి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కొత్త రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుని చేరిక,. రైస్ కార్డ్ విభజన, రైస్ కార్డులో నుండి సభ్యుని తొలగింపు, రైస్ కార్డ్ సమర్పణ, రైస్ కార్డులో చిరునామా మార్పు, రైస్ కార్డులో తప్పుగా పొందిన ఆధార్ లింకేజీ సవరణ సేవలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

(7 / 7)

కొత్త రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుని చేరిక,. రైస్ కార్డ్ విభజన, రైస్ కార్డులో నుండి సభ్యుని తొలగింపు, రైస్ కార్డ్ సమర్పణ, రైస్ కార్డులో చిరునామా మార్పు, రైస్ కార్డులో తప్పుగా పొందిన ఆధార్ లింకేజీ సవరణ సేవలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు