(1 / 7)
ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి(మే 7) నుంచి నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
(2 / 7)
నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించండం మరియు కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
(3 / 7)
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులో ఉన్న ఈ సేవలు… త్వరలోనే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా కూడా అమలు చేయనున్నారు. ఈ వారం రోజులలోపు వాట్సాప్ గవర్నెన్సు ద్వారా కూడా ఈ సేవలను పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై రేపోమాపో ప్రకటన రానుంది. 9552300009 వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేసి ఈ సేవలు పొందవచ్చు.
(4 / 7)
(5 / 7)
(6 / 7)
ఇతర గ్యాలరీలు