రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ తప్పనిసరి, మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన-ap ration card ekyc mandatory for all members minister nadenla key announcement ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ తప్పనిసరి, మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ తప్పనిసరి, మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Updated May 11, 2025 09:11 PM IST Bandaru Satyaprasad
Updated May 11, 2025 09:11 PM IST

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు.

(1 / 6)

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు.

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

(2 / 6)

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

ఈ నెల 15 నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ సేవలు అందుబాటులోకి తేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.

(3 / 6)

ఈ నెల 15 నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ సేవలు అందుబాటులోకి తేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.

ఏడాదిలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేశామన్నారు.

(4 / 6)

ఏడాదిలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేశామన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72,500 మంది స్మార్ట్‌ కార్డులు పొందారన్నారు.

(5 / 6)

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72,500 మంది స్మార్ట్‌ కార్డులు పొందారన్నారు.

పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి, ఒంటరిగా ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా తొలిసారిగా రేషన్‌ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.

(6 / 6)

పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి, ఒంటరిగా ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా తొలిసారిగా రేషన్‌ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు