ఏపీ పాలిసెట్ - 2025 ఫలితాల విడుదలపై కీలక అప్డేట్-ap polycet 2025 results will be released in the third week of may ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ పాలిసెట్ - 2025 ఫలితాల విడుదలపై కీలక అప్డేట్

ఏపీ పాలిసెట్ - 2025 ఫలితాల విడుదలపై కీలక అప్డేట్

Published May 08, 2025 05:54 PM IST Maheshwaram Mahendra Chary
Published May 08, 2025 05:54 PM IST

ఏపీ పాలిసెట్ - 2025 ఫలితాల విడుదలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. మే మూడో వారంలో రిజల్ట్స్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఫలితాలను polycetap.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఏపీ పాలిసెట్ - 2025 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. మే మూడో వారంలో రిజల్ట్స్ ను ప్రకటించనున్నట్లు ప్రకటించారు.

(1 / 8)

ఏపీ పాలిసెట్ - 2025 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. మే మూడో వారంలో రిజల్ట్స్ ను ప్రకటించనున్నట్లు ప్రకటించారు.

ఏపీ పాలిసెట్ స్కోర్ తో పాటే ర్యాంక్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ ఫలితాలను https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

(2 / 8)

ఏపీ పాలిసెట్ స్కోర్ తో పాటే ర్యాంక్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ ఫలితాలను https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

(istock.com)

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్‌ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

(3 / 8)

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్‌ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ పాలిసెట్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని మే 2వ తేదీన విడుదల చేశారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత…తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే మే మూడో వారంలో ఫలితాలను విడుదల చేయనన్నట్లు అధికారులు ప్రకటించారు.

(4 / 8)

ఏపీ పాలిసెట్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని మే 2వ తేదీన విడుదల చేశారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత…తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే మే మూడో వారంలో ఫలితాలను విడుదల చేయనన్నట్లు అధికారులు ప్రకటించారు.

(istock.com)

ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ను 120 మార్కులకు నిర్వహించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు.

(5 / 8)

ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ను 120 మార్కులకు నిర్వహించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు.

(istock.com)

విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. వీటితో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

(6 / 8)

విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. వీటితో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

ఏపీ పాలిసెట్ ఫలితాలను ప్రకటించిన వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ షెడ్యూల్ ను ఏపీ సాంకేతిక విద్యా మండలి విడుదల చేస్తుంది.

(7 / 8)

ఏపీ పాలిసెట్ ఫలితాలను ప్రకటించిన వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ షెడ్యూల్ ను ఏపీ సాంకేతిక విద్యా మండలి విడుదల చేస్తుంది.

ఏపీ పాలిసెట్ - -2025 ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ అప్డేట్స్ కోసం https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 7901620551 / 7901620557 / 7901620567 / 7901620502 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

(8 / 8)

ఏపీ పాలిసెట్ - -2025 ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ అప్డేట్స్ కోసం https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 7901620551 / 7901620557 / 7901620567 / 7901620502 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు