(1 / 7)
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి (జూన్ 20) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇది జూలై 1వ తేదీతో పూర్తవుతుంది.
(2 / 7)
మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ అభ్యర్థుల వరకు ఫీజు చెల్లించుకోవాలి. ఇందుకు జూన్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇక వెబ్ ఆప్షన్లకు జూన్ 30 వరకు గడువు ఉంటుంది. జూలై 3వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత పాలిసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
(3 / 7)
ఏపీ పాలిసెట్ - 2025లో అర్హత సాధించిన విద్యార్థులు https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.
(4 / 7)
ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను ఎంట్రీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత… కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. మీ ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
(5 / 7)
జూలై 3వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత పాలిసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
అలాట్ మెంట్ కాపీని https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.
(6 / 7)
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇక 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
(7 / 7)
గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఇతర గ్యాలరీలు