ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap megs dsc notification 2025 released here direct link to download syllabus ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Published Apr 20, 2025 10:42 AM IST Maheshwaram Mahendra Chary
Published Apr 20, 2025 10:42 AM IST

  • ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. అంతేకాదు అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు సిలబస్ వివరాలను కూడా అందుబాటులో ఉంచింది. ఈ వివరాలను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి…

ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి వెబ్ సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది.

(1 / 7)

ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి వెబ్ సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది.

టీచర్ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్ తో పాటు దరఖాస్తు ప్రాసెస్ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.  ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణకు మే 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

(2 / 7)

టీచర్ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్ తో పాటు దరఖాస్తు ప్రాసెస్ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణకు మే 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్టీటీ, స్కూల్ అసిస్టెంట్ తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల సిలబస్ వివరాలను పేర్కొంది.

(3 / 7)

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్టీటీ, స్కూల్ అసిస్టెంట్ తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల సిలబస్ వివరాలను పేర్కొంది.

అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ “MEGA DSC 2025 Suggestive Syllabus” అని వస్తుంది. దాని పక్కన వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ కాపీని పొందవచ్చు.

(4 / 7)

అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ “MEGA DSC 2025 Suggestive Syllabus” అని వస్తుంది. దాని పక్కన వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ కాపీని పొందవచ్చు.

ఏపీ మెగా డీఎస్సీలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్షను  మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ నాల్డెజ్ కు 8 మార్కులు, Perspectives in Educationకు 4 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్కులు ఉంటాయి. కంటెంట్ అండ్ మెథడలాజీకి 60 మార్కులు (40+20) ఉంటాయి. మరో 20 మార్కులు టెట్ స్కోర్ నుంచి వెయిటేజీ ఇస్తారు.

(5 / 7)

ఏపీ మెగా డీఎస్సీలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్షను మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ నాల్డెజ్ కు 8 మార్కులు, Perspectives in Educationకు 4 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్కులు ఉంటాయి. కంటెంట్ అండ్ మెథడలాజీకి 60 మార్కులు (40+20) ఉంటాయి. మరో 20 మార్కులు టెట్ స్కోర్ నుంచి వెయిటేజీ ఇస్తారు.

పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులకు 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలను కూడా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో ఉంచారు.

(6 / 7)

పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులకు 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలను కూడా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో ఉంచారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ మెగా డీఎస్సీ - 2025 సిలబస్ వివరాలను పొందవచ్చు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.

(7 / 7)

లింక్ పై క్లిక్ చేసి ఏపీ మెగా డీఎస్సీ - 2025 సిలబస్ వివరాలను పొందవచ్చు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు