(1 / 6)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదాలో కొనసాగుతోన్న వారి జీతభత్యాలను పెంచింది.
(2 / 6)
కేబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
(3 / 6)
కేబినెట్ హోదా ఉన్నవారికి జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్ టైమ్ గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
(4 / 6)
కేబినెట్ ర్యాంకు హోదా ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి. ఈ నిర్ణయంతో కేబినెట్ హోదాలో ఉన్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(5 / 6)
వివిధ రంగాల్లో నిపుణులను ప్రభుత్వం... సలహాదారులుగా నియమిస్తుంది. పాలనాపర సలహాలు, సూచనలు చేసేందుకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని సలహాదారులగా నియమిస్తారు. వీరిలో కొందరికి కేబినెట్ హోదా కల్పిస్తారు.
(6 / 6)
నామినేటెడ్ పదవులను సైతం ప్రభుత్వం కేటాయిస్తుంది. నామినేటెడ్ పొందిన కొందరికి కేబినెట్ హోదా కల్పించింది. వీరికి తాజాగా జీతం పెంచింది.
ఇతర గ్యాలరీలు