(1 / 6)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెలవులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
(2 / 6)
ఏపీలో ప్రస్తుతం 120 రోజులు మెటర్నిటీ సెలవులు ఇస్తున్నారు. తాజాగా వాటిని 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
(3 / 6)
గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇచ్చేవారు. తాజా జీవోలో ఆ నిబంధనను తొలగించారు. ఎంతమంది పిల్లలను కన్నా యథావిథిగా సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
(4 / 6)
గత నిబంధనలు తొలగించి తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
(5 / 6)
మహిళా ఉద్యోగుల నుంచి చాలా కాలం నుంచి ఈ డిమాండ్ ఉండటంతో ఏపీ ప్రభుత్వం సెలవులు పెంచింది.
ఇతర గ్యాలరీలు