ఏపీ అభివృద్ధిపై బ్లూ ప్రింట్‌ ప్రజంటేషన్‌ - సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు..!-ap cm chandrababu presentation at niti aayog meeting praised by pm modi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ అభివృద్ధిపై బ్లూ ప్రింట్‌ ప్రజంటేషన్‌ - సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు..!

ఏపీ అభివృద్ధిపై బ్లూ ప్రింట్‌ ప్రజంటేషన్‌ - సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు..!

Published May 25, 2025 07:44 AM IST Maheshwaram Mahendra Chary
Published May 25, 2025 07:44 AM IST

ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్‌పై ప్రధాని ప్రశంసలు గుప్పించారు.

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.

(1 / 6)

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.

ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండవ, మూడవ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా… ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు.

(2 / 6)

ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండవ, మూడవ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా… ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పీ 4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని అన్నారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు.  రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధి చేపడుతున్న కార్యక్రమాలను కూడా లేవనెత్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తోందన్నారు.

(3 / 6)

స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పీ 4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని అన్నారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధి చేపడుతున్న కార్యక్రమాలను కూడా లేవనెత్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తోందన్నారు.

స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 ద్వారా ఏపీలో ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి దోహదపడేలా ఆదర్శంగా నిలుస్తుందని సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశానికి స్వతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా...మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.

(4 / 6)

స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 ద్వారా ఏపీలో ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి దోహదపడేలా ఆదర్శంగా నిలుస్తుందని సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశానికి స్వతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా...మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.

నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

(5 / 6)

నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.


ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక ఈ సమావేశం సందర్భంగా… ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, స్టాలిన్ మాట్లాడుతూ నవ్వులు చిందించారు.

(6 / 6)

ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక ఈ సమావేశం సందర్భంగా… ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, స్టాలిన్ మాట్లాడుతూ నవ్వులు చిందించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు