అమరావతి ఊపిరి పీల్చుకో.. మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పున:ప్రారంభం..-amaravati work to resume on may 2nd under the leadership of prime minister modi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అమరావతి ఊపిరి పీల్చుకో.. మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పున:ప్రారంభం..

అమరావతి ఊపిరి పీల్చుకో.. మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పున:ప్రారంభం..

Published Apr 17, 2025 02:22 PM IST Sarath Chandra.B
Published Apr 17, 2025 02:22 PM IST

  • ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పనుల పునరుద్ధరణకు ముహుర్తం ఖరారైంది. మే 2వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. 2015లో అమరావతి నిర్మాణ పనులు ప్రధాని ప్రారంభించగా 2019-24 మధ్య పనులు నిలిచిపోయాయి.

అమరావతిలో 1375 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఐకానిక్ భవనాలతో పాటు విధాన సభ, హైకోర్టు,  సచివాలయం, రాజ్‌భవన్‌,  ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలను ఏర్పాటు చేస్తారు.

(1 / 7)

అమరావతిలో 1375 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఐకానిక్ భవనాలతో పాటు విధాన సభ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలను ఏర్పాటు చేస్తారు.

అమరావతి రాజధాని పనుల పున: ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ప్రధాని షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. మే 2వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని అమరావతి పనులను  ప్రారంభిస్తారు. 2015లో దసరా సందర్భంగా అమరావతి నిర్మాణానికి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పదేళ్ల తర్వాత  మళ్లీ ఆయనే పనుల్ని ప్రారంభించనున్నారు.

(2 / 7)

అమరావతి రాజధాని పనుల పున: ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ప్రధాని షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. మే 2వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని అమరావతి పనులను ప్రారంభిస్తారు. 2015లో దసరా సందర్భంగా అమరావతి నిర్మాణానికి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఆయనే పనుల్ని ప్రారంభించనున్నారు.

అమరావతిలో ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్‌ డిజైన్ చేసి స్పైక్‌ ఆకారంలో  శాసనసభను నిర్మిస్తారు. 250మీటర్ల ఎత్తైన స్పైక్‌ ఆకారంలో ఈ భవనాన్ని నిర్మిస్తారు.  80 మీటర్ల ఎత్తులో వ్యూ యింగ్‌ డెక్‌  ఉంటుంది.  12.16 లక్షల చదరపు  అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ హాల్ నిర్మాణం జరుగుతుంది.  100మంది సామర్థ్యంలో కౌన్సిల్ హాల్ నిర్మిస్తారు.

(3 / 7)

అమరావతిలో ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్‌ డిజైన్ చేసి స్పైక్‌ ఆకారంలో శాసనసభను నిర్మిస్తారు. 250మీటర్ల ఎత్తైన స్పైక్‌ ఆకారంలో ఈ భవనాన్ని నిర్మిస్తారు. 80 మీటర్ల ఎత్తులో వ్యూ యింగ్‌ డెక్‌ ఉంటుంది. 12.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ హాల్ నిర్మాణం జరుగుతుంది. 100మంది సామర్థ్యంలో కౌన్సిల్ హాల్ నిర్మిస్తారు.

చారిత్రక బౌద్ధ స్థూపం  శిల్ప కళ ప్రేరణతో ఏపీ హైకోర్టు భవనానికి డిజైన్‌ చేశారు. 12.5 లక్షల అడుగుల విస్తీర్ణంలో 36కోర్టు హళ్లను ఇందులో నిర్మిస్తారు.

(4 / 7)

చారిత్రక బౌద్ధ స్థూపం శిల్ప కళ ప్రేరణతో ఏపీ హైకోర్టు భవనానికి డిజైన్‌ చేశారు. 12.5 లక్షల అడుగుల విస్తీర్ణంలో 36కోర్టు హళ్లను ఇందులో నిర్మిస్తారు.

అమరావతి రాజధాని నగరాన్ని మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. సెక్రటేరియట్‌, హెచ్‌ఓడి కార్యాలయాలను నిరమిస్తారు. అన్ని శాఖల కార్యాలయాలు, సచివాలయం, ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మిస్తారు.  40 అంతస్తులతో  4 టవర్లతో  గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తారు.  డయా గ్రిడ్ టెక్నాలజీతో వీటి నిర్మాణం చేపడతారు. పిల్లర్లు లేక పోవడంతో ఎక్కువ స్థలం వినియోగంలోకి వస్తుంది.

(5 / 7)

అమరావతి రాజధాని నగరాన్ని మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. సెక్రటేరియట్‌, హెచ్‌ఓడి కార్యాలయాలను నిరమిస్తారు. అన్ని శాఖల కార్యాలయాలు, సచివాలయం, ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మిస్తారు. 40 అంతస్తులతో 4 టవర్లతో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తారు. డయా గ్రిడ్ టెక్నాలజీతో వీటి నిర్మాణం చేపడతారు. పిల్లర్లు లేక పోవడంతో ఎక్కువ స్థలం వినియోగంలోకి వస్తుంది.

అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమానికి  ప్రధాని రానుండటంతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు.

(6 / 7)

అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని రానుండటంతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభించనుండటంతో  ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్,కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్,నాదెండ్ల మనోహర్,పి.నారాయణలతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.

(7 / 7)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభించనుండటంతో ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్,కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్,నాదెండ్ల మనోహర్,పి.నారాయణలతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు