TG Governor Meets Chandrababu : సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ, విభజన సమస్యలపై చర్చ!-amaravati tg governor radhakrishnan meets ap cm chandrababu later visits durga temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Governor Meets Chandrababu : సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ, విభజన సమస్యలపై చర్చ!

TG Governor Meets Chandrababu : సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ, విభజన సమస్యలపై చర్చ!

Published Jun 28, 2024 03:25 PM IST Bandaru Satyaprasad
Published Jun 28, 2024 03:25 PM IST

  • TG Governor Meets Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో విభజన సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

(1 / 6)

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై సీఎం చంద్రబాబు, గవర్నర్ రాధాకృష్ణన్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయనను సత్కరించారు.

(2 / 6)

ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై సీఎం చంద్రబాబు, గవర్నర్ రాధాకృష్ణన్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయనను సత్కరించారు.

సుమారు రెండు గంటల పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సమావేశం అయ్యారు. పెండింగులో ఉన్న విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. 

(3 / 6)

సుమారు రెండు గంటల పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సమావేశం అయ్యారు. పెండింగులో ఉన్న విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. 

సీఎం చంద్రబాబుతో సమావేశం ముగిసిన అనంతరం ఇంద్రకీలాద్రి కనకదుర్మ అమ్మవారిని గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. 

(4 / 6)

సీఎం చంద్రబాబుతో సమావేశం ముగిసిన అనంతరం ఇంద్రకీలాద్రి కనకదుర్మ అమ్మవారిని గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. 

 తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు దుర్గగుడి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం గవర్నర్ కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని అందించారు. 

(5 / 6)

 తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు దుర్గగుడి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం గవర్నర్ కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని అందించారు. 

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఏపీ‌ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసానని తెలిపారు. చంద్రబాబు అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి అన్నారు. అమ్మవారిని దర్శించుకుందామనే విజయవాడ వచ్చానని తెలంగాణ గవర్నర్ వెల్లడించారు. 

(6 / 6)

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఏపీ‌ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసానని తెలిపారు. చంద్రబాబు అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి అన్నారు. అమ్మవారిని దర్శించుకుందామనే విజయవాడ వచ్చానని తెలంగాణ గవర్నర్ వెల్లడించారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు