AISSEE 2026 : సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌ - అప్లికేషన్ తేదీలివే-all india sainik school entrance exam 2025 notification out online applications begins ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aissee 2026 : సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌ - అప్లికేషన్ తేదీలివే

AISSEE 2026 : సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌ - అప్లికేషన్ తేదీలివే

Published Oct 12, 2025 10:17 AM IST Maheshwaram Mahendra Chary
Published Oct 12, 2025 10:17 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (NTA) నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్  ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (NTA) నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది.

(1 / 6)

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (NTA) నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది.

2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఆరో త‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అక్టోబర్ 30న ఆఖ‌రు తేదీ.

(2 / 6)

2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఆరో త‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అక్టోబర్ 30న ఆఖ‌రు తేదీ.

ప్ర‌వేశ ప‌రీక్ష జ‌న‌వ‌రి, 2026లో నిర్వ‌హిస్తారు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://exams.nta.nic.in/r  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, స్టూడెంట్ ఫోటో, సంత‌కం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

(3 / 6)

ప్ర‌వేశ ప‌రీక్ష జ‌న‌వ‌రి, 2026లో నిర్వ‌హిస్తారు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://exams.nta.nic.in/r ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, స్టూడెంట్ ఫోటో, సంత‌కం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆరవ తరగతిలో ప్రవేశానికి మొత్తం నాలుగు విభాగాల్లో 125 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. 2:30 గంటల సమయం ఉంటుంది. మైనస్ మార్కులు ఉండవు. మొత్తం సీట్లతో 67%  స్థానిక ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు

(4 / 6)

ఆరవ తరగతిలో ప్రవేశానికి మొత్తం నాలుగు విభాగాల్లో 125 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. 2:30 గంటల సమయం ఉంటుంది. మైనస్ మార్కులు ఉండవు. మొత్తం సీట్లతో 67% స్థానిక ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు

తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి ఎనిమిదో తరగతి చదువుతూ లేదా పాస్ అయి ఉండాలి వయసు మార్చి 31st  2026 నాటికి 13 నుండి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ ఫస్ట్ 2011 నుండి మార్చి 31st  2013 మధ్య జన్మించిన వారై ఉండాలి.

(5 / 6)

తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి ఎనిమిదో తరగతి చదువుతూ లేదా పాస్ అయి ఉండాలి వయసు మార్చి 31st 2026 నాటికి 13 నుండి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ ఫస్ట్ 2011 నుండి మార్చి 31st 2013 మధ్య జన్మించిన వారై ఉండాలి.

జ‌న‌ర‌ల్‌, డిఫెన్స్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు అప్లికేషన్ ఫీజు రూ.850 , ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు రూ.700 ఉంటుంది. ఈ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఏపీ, తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలుంటాయి. పరీక్ష పూర్తి అయిన నాలుగు లేదా 6 వారాల లోపు ఫలితాలను ప్రకటిస్తారు. https://examinationservices.nic.in/ExamSys2026/ లింక్ తో నేరుగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే 011-40759000 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదివచ్చు.

(6 / 6)

జ‌న‌ర‌ల్‌, డిఫెన్స్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు అప్లికేషన్ ఫీజు రూ.850 , ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు రూ.700 ఉంటుంది. ఈ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఏపీ, తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలుంటాయి. పరీక్ష పూర్తి అయిన నాలుగు లేదా 6 వారాల లోపు ఫలితాలను ప్రకటిస్తారు. https://examinationservices.nic.in/ExamSys2026/ లింక్ తో నేరుగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే 011-40759000 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదివచ్చు.

(Unsplash )

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు