(1 / 5)
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో…. అధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
(2 / 5)
పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి..? భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలపై భద్రతా దళాలు మాక్ డ్రిల్ చేపట్టాయి. లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం సాయంత్రం ఈ డ్రిల్ కొనసాగింది.
(3 / 5)
అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.
(4 / 5)
అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇన్టర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది.
ఇతర గ్యాలరీలు