Crime news : 31 గంటల నరకం! జైలులో భర్త- యువతిపై సామూహిక అత్యాచారం..
Maharashtra crime news : మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. ఆ యువతిపై ఆమె భర్తకు అన్న అయిన ఓ వ్యక్తి, తన సహచరులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె భర్త జైలులో ఉండగా ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ యువతిపై ఆమె భర్త సోదరుడు, ఇతరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 31 గంటల పాటు ఆమె నరకం చూసింది.
ఇదీ జరిగింది..
18ఏళ్ల యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. కానీ అప్పటికి ఆమె ఒక మైనర్. ఈ నేపథ్యంలోనే ఆమె తల్లిదండ్రులు యువతి భర్తపై ముంబై అంథేరీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ముంబై జైలులో పెట్టారు. కాగా, భర్తకు బెయిల్ కోసం ఆ యువతి బయట చాలా కష్టాలు పడింది. ఈ నేపథ్యంలోనే.. భర్తకు అన్న అయిన ఓ వ్యక్తి.. ఆ యువతిని సంప్రదించాడు. తమ్ముడుకి బెయిల్ ఇప్పిస్తానని, తనను కలవాలని యువతికి చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె.. బుధవారం ఉదయం నాసిక్కి వెళ్లి అతడిని కలిసింది.
బెయిల్కి గ్యాంటర్ని పరిచయం చేస్తానని చెప్పి యువతికి ఆ వ్యక్తి పంచవటి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతనితో మరికొందరు చేరారు. ఆమెకు భోజనం ఆఫర్ చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ వెంటనే ఆమెపై దాడి చేశారు!
యువతిని నిందుతులు చెట్టుకు కట్టేశారు. చాలా సేపు కొట్టారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పలుమార్లు కొట్టారు. ఆమె చాలా సార్లు స్పృహ కోల్పోయింది. తిరిగి కళ్లు చెరిచేసరికి ఆ రోజు గడిచిపోయింది! గురువారం ఉదయం స్పృహలోకి వచ్చిన ఆమెకు నడవానికి ఇబ్బంది అయ్యింది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ వారందరు ఆమెను మళ్లీ కొట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే జరిగింది! టాయిలెట్కి వెళ్లాలని చెప్పి, ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. ఆమెను పట్టుకునేందుకు నిందితుల్లో ఒకరు ప్రయత్నించారు. అతడిని వదిలించుకుని ఆమె పారిపోయింది.
చివరికి.. నాసిక్కి వెళ్లిన యువతి.. పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న వ్యక్తి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు విజయ్ దామ్లే, గోపాల్ రాజేంద్ర నాగోల్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదు. మరో ఇద్దరిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత కథనం