Woman paraded naked : మహిళను నగ్నంగా చేసి ఊరేగించిన భర్త!-woman beaten paraded naked by husband and in laws in rajasthan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Woman Beaten, Paraded Naked By Husband And In-laws In Rajasthan

Woman paraded naked : మహిళను నగ్నంగా చేసి ఊరేగించిన భర్త!

Sharath Chitturi HT Telugu
Sep 02, 2023 09:12 AM IST

Woman paraded naked : మహిళను నగ్నంగా చేసిన ఆమె భర్త, ఊరంతా ఊరేగించిన రాజస్థాన్​లో వెలుగులోకి వచ్చింది. వేరే వ్యక్తితో ఆమె కలిసి జీవిస్తుండటమే ఇందుకు కారణం!

మహిళను నగ్నంగా చేసి ఊరేగించిన భర్త!
మహిళను నగ్నంగా చేసి ఊరేగించిన భర్త!

Woman paraded naked : రాజస్థాన్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను నగ్నంగా చేసిన ఓ వ్యక్తి, గ్రామంలో ఊరేగించాడు. ఇందుకు అతని కుటుంబసభ్యులు సాయం చేశారు!

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

సంబంధిత ఘటన రాజస్థాన్​ ప్రతాప్​గఢ్​ జిల్లాలోని నిచాల్​కోట అనే గ్రామంలో జరిగింది. బాధితురాలికి ఏడాది క్రితం వివాహమైంది. కానీ ఆమె అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళను, ఆమె భర్త తరఫు కుటుంబసభ్యులు గురువారం సాయంత్రం కిడ్నాప్​ చేసి, వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ, మహిళను ఆమె భర్త కొట్టాడు. అనంతరం ఆమెను నగ్నంగా చేశాడు. ఆ తర్వాత.. గ్రామంలో కిలోమీటర్​ మేర ఊరేగించాడు. ఇందుకు.. అతని కుటుంబసభ్యులు కూడా సాయం చేశారు.

Woman paraded naked in Rajasthan : ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి శుక్రవారం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. గురువారం ఘటన జరగ్గా.. పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సంబంధిత గ్రామానికి వెళ్లారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. వారిని అరెస్ట్​ చేసిన అధికారులు.. ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

మహిళను నగ్నంగా చేసి, ఊరేగించిన ఘటనపై రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రాజకీయ దుమారం..

Rajasthan crime news : ఈ ఘటనపై రాజస్థాన్​లో రాజకీయ దుమారం నెలకొంది. బీజేపీ నేతలు కాంగ్రెస్​ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

"ఈరోజు రాజస్థాన్​ తలించుకునే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులకు అసలు సమాచారమే లేదు. మహిళలపై రేప్​, నేరాల్లో రాజస్థాన్​ నెం.1లో ఉండానికి కారణం ఇదే," అని బీజేపీ ఎంపీ సీపీ జోషి మండిపడ్డారు.

వాస్తవానికి ఇటీవలి కాలంలో రాజస్థాన్​లో మహిళలపై నేరాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు రాష్ట్రంలోని ఏదో ఒక మూల వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. త్వరలోనే రాజస్థాన్​లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.