India census : దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు.. త్వరలోనే మొదలవ్వనున్నాయా?-with little time left for admin work census unlikely before ls elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Census : దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు.. త్వరలోనే మొదలవ్వనున్నాయా?

India census : దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు.. త్వరలోనే మొదలవ్వనున్నాయా?

Sharath Chitturi HT Telugu

India census : 2020లో జరగాల్సిన జనాభా లెక్కలు.. ఇప్పటికీ మొదలవ్వలేదు. మరి జనగణన ఎప్పుడు మొదలవుతుంది?

జనాభా లెక్కలు త్వరలోనే మొదలవ్వనున్నాయా?

India census : జనాభా సంఖ్యలో చైనాను ఇండియా దాటేసిందని వార్తలు వచ్చాయి. దానిని రుజువు చేసేందుకు జరగాల్సిన జనగణన మాత్రం దేశంలో ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. కొవిడ్​ కారణంగా 2020 నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కలు.. 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు జరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు!

2024 లోక్​సభ ఎన్నికల తర్వాతే..!

ఎన్​పీఆర్​ (నేషనల్​ పాప్యులేషన్​ రిజిస్టర్​)ను అప్డేట్​ చేసేందుకు ఉపయోగపడే హౌజ్​ లిస్టింగ్​ దశ.. వాస్తవానికి 2020 ఏప్రిల్​ 1- సెప్టెంబర్​ 30 మధ్యలో జరగాల్సి ఉంది. కానీ కొవిడ్​ కారణంగా అది జరగలేదు. అప్పటి నుంచి జనాభా లెక్కల కార్యకలాపాలు హోల్డ్​లోనే ఉంటున్నాయి. జనగణనకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్​ను ప్రకటించలేదు. కాగా.. ఎప్పుడు జనాభా లెక్కలు మొదలైనా.. స్మార్ట్​ఫోన్​, ఇంటర్నెట్​, ల్యాప్​టాప్​, కంప్యూటర్​, కార్స్​, టూ వీలర్స్​ వంటి వాటికి యాక్సెస్​ ఉందా? లేదా? అన్న ప్రశ్నలతో పాటు మొత్తం మీద 31 ప్రశ్నలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం.. జనగణనకు ముందు.. జిల్లాలు, ఉప జిల్లాలు, మండలాలు, పోలీస్​ స్టేషన్ల పాలనా పరమైన సరిహద్దులను మూడు నెలల పాటు ఫ్రీజ్​ చేసి ఉంచాలి. ఆ తర్వాతే జనగణన మొదలుపెట్టాలి. ఇలా ఫ్రీజ్​ చేసేందుకు ఈ ఏడాది జూన్​ 30 వరకు గడువునిచ్చింది రిజిస్ట్రార్​ జనరల్​ అండ్​ సెన్సెస్​ కమిషనర్​ ఆఫ్​ ఇండియా. అంటే ఏదైనా మార్పులు చేసుకోవాలంటే జూన్​ 30 నాటికి పూర్తవ్వాలి. అనంతరం అక్కడి నుంచి 3 నెలల వరకు జనగణన చేయకూడదు. అంటే సెప్టెంబర్​ వరకు జనగణన జరగని పని!

ఇదీ చూడండి:- World population is 8 bn: ప్రపంచ జనాభా 800 కోట్లు; భారత్ దే మెజారిటీ షేర్

Census in India 2023 : అదే సమయంలో 2024 లోక్​సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓటర్​ జాబితా సవరణ ప్రక్రియతో పాటు ఇతర కార్యకలాపాలను త్వరగా మొదలుపెట్టాలని ఈసీ ఆశిస్తోందని సమాచారం. మరోవైపు జనగణన కోసం 30లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు శిక్షణ ఇవ్వాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. వీటన్నింటినీ చూస్తుంటే.. సెప్టెంబర్​ 30 తర్వాత కూడా జనగణన జరగడం అనుమానంగానే ఉంది. ఎందుకంటే.. ఈ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లేనే ఎన్నికల సంఘం కూడా ఉపయోగించుకుంటుంది. అంటే.. 2020లో జరగాల్సిన జనగణన.. 2024 లోక్​సభ ఎన్నికలు పూర్తైన తర్వతే మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తొలి డిజిటల్​ సెన్సెస్​..!

ఇండియాలో జనగణనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు జరిగినా.. దేశ చరిత్రలో ఇదే తొలి డిజిటల్​ సెన్సెస్​గా నిలిచిపోనుంది. ఇందుకోసం అధికారులు ఓ పోర్టల్​ను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఇంట్లో ఎలాంటి పప్పుధాన్యాలు వాడుతున్నారు, తాగునీరు- లైట్​ సోర్స్​లు ఏంటి, టాయిలెట్లకు యాక్సెస్​ ఉందా, స్నానాలకు వెసులుబాటు ఉందా, ఎల్​పీజీ/ పీఎన్​జీ కనెక్షన్లు ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఈ దఫా జనగణనలో అడిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.