భర్తను చంపిన భార్య.. కొడుకుతో కలిసి..!
Wife kills husband | భర్తను.. కొడుకు సాయంతో హత్య చేసింది ఓ భార్య. అనంతరం 7వ అంతస్తు నుంచి కిందికి పడేసింది. ఆధారాలను ధ్వంసం చేసేందుకు వారు ప్రయత్నించారు. పోలీసులకు కట్టుకథలు చెప్పారు. చివరికి పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
Maharastra crime news | మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. భర్తను ఓ భార్య హత్య చేసింది. ఇందుకు కొడుకు కూడా సహకరించాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
అంబాలీ ప్రాంతంలో.. ఓ వ్యక్తి 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. 54ఏళ్ల షాంతను కృష్ణ శేషాద్రి అనే వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. శేషాద్రి గతంలోనూ ఆత్మహత్యకు యత్నించినట్టు అతని భార్య, కుమారుడు పోలీసులకు వెల్లడించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. కొడుకుతో కలిసి భర్తను.. ఆ మహిళ కొట్టి చంపేసినట్టు తేలింది. ఆధారాలను ధ్వంసం చేసేందుకు కూడా వారు యత్నించినట్టు రుజువైంది.
"ప్రాథమిక నివేదిక ప్రకారం.. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. 7వ అంతస్థు నుంచి మృతదేహాన్ని కిందికి పడేసింది," అని పోలీసులు వివరించారు.
ఈ ఘటనపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ, ఆమె కొడుకును అరెస్ట్ చేశారు.
కస్టమర్పై టైలర్ దాడి..
Tailor attacks customer | మహారాష్ట్రలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవలే.. ఓ టైలర్.. తన కస్టమర్పై నడిరోడ్డు మీద కత్తెరతో దాడి చేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన కస్టమర్ను వెంబడించి పట్టుకుని, కత్తెరతో అనేకమార్లు పొడిచాడు. రూ. 30 కోసం జరిగిన గొడవ ఇందుకు కారణం.
రోహిత్ యాదవ్ అనే వ్యక్తి అంధేరీలోని ఓ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సోమవారం.. ఇంటి దగ్గర ఉన్న హరీశ్ ఠాకర్(40) అనే టైలర్ దగ్గరికి వెళ్లాడు. తన ప్యాంట్ ఆల్ట్రేషన్ చేయమని చెప్పి ఠాకర్కు ఇచ్చాడు. రూ. 100 అవుతుందని టైలర్ చెప్పగా.. సరే అని రోహిత్ వెళ్లిపోయాడు.
అదే రోజు మధ్యాహ్నం.. పనైపోయిందని, వచ్చి ప్యాంట్ తీసుకోవాలని రోహిత్కు హరీశ్ ఫోన్ చేశాడు. అక్కడి రోహిత్ వెళ్లగా.. తొందరగా పనిపూర్తి చేశానని, అందుకే మొత్తం 130 రూపాయలు ఇవ్వాలని హరీశ్ డిమాండ్ చేశాడు. తాను రూ. 100 మాత్రమే ఇస్తానని రోహిత్ వాదించాడు. వారి మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది.
రూ. 100 ఇచ్చి ప్యాంట్ తీసుకుని వెళ్లిపోయాడు రోహిత్. అది చూసి హరీశ్కు కోపమొచ్చింది. తన కత్తెరతో రోహిత్ను వెంబడించాడు. నడిరోడ్డు మధ్యలో రోహిత్ను ఆపి కత్తెరతో బెదిరించాడు. భయపడిన రోహిత్.. హరీశ్ను శాంతిపజేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ టైలర్ మాత్రం తన చేతిలో ఉన్న కత్తెరతో రోహిత్ కడుపులో పొడిచాడు. పారిపోడానికి ప్రయత్నించిన రోహిత్ను.. హరీశ్ పట్టుకుని మరీ పలుమార్లు దాడి చేశాడు. ఆ తర్వాత టైలర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు.. రోహిత్ను ఆసుపత్రిలో చేర్చారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హరీశ్ ఠాకర్ కోసం తీవ్రంగా గాలించారు. మంగళవారం అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.
సంబంధిత కథనం