Putin G20 summit : జీ20 సదస్సుకు దూరంగా పుతిన్.. రష్యాకే నష్టం!
Putin G20 summit 2022 : మరికొన్ని రోజుల్లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్లడం లేదు. భంగపాటు నుంచి తప్పించుకునేందుకు ఆయన వెళ్లడం లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Putin G20 summit 2022 : ఇండోనేషియా బాలీలో జరుగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూరంగా ఉండనున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆయన ప్రసంగించడం లేదు. 'బిజీ షెడ్యూల్' అని క్రెమ్లిన్ చెబుతున్నా.. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు తనను నిలదీస్తాయేమో అన్న కారణంతోనే.. ఆయన జీ20 సదస్సుకు వెళ్లడం లేదని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఇదే కారణమా..?
2014లో ఉక్రెయిన్లోని క్రిమియాను ఆక్రమించుకుంది రష్యా. ఈ పరిణామాల మధ్య ఆ ఏడాది బ్రిస్బేన్లో జీ20 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వెళ్లిన పుతిన్కు.. ఒక రకంగా భంగపాటు ఎదురైందనే చెప్పుకోవాలి! ప్రపంచ దేశాల నేతలు పుతిన్తో పెద్దగా మాట్లాడలేదు. సంప్రదాయబద్ధంగా దిగే ఫొటోలోనూ పుతిన్ను చివర్లో నుల్చొబెట్టారు.
ఇప్పుడు ఉక్రెయిన్పై రష్యా పూర్తిస్థాయి యుద్ధమే చేస్తుండటంతో.. గతంలో కన్నా పరిస్థితులు ఇప్పుడు మరింత తీవ్రంగా ఉండొచ్చని క్రెమ్లిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పుతిన్.. ఈ దఫా జీ20 సదస్సుకు వెళ్లలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2022 G20 Summit date : "సదస్సుకు వెళితే.. మనుషులతో మాట్లాడాలి. ఫొటోలి దిగాలి. కానీ ఆయనతో(పుతిన్) ఎవరు మాట్లాడతారు? ఎలా ఫొటోలు తీస్తారు? ఉక్రెయిన్తో యుద్ధంలో ఆయన నిర్ణయం మారదు. ఇతర దేశాధినేతల నిర్ణయాలు కూడా మారవు. మరి జీ20 సదస్సుకు వెళ్లి ఏం లాభం?" అని రష్యా అని గ్లోబల్ అఫైర్స్ జర్నల్ ఎడిటర్ లక్యనోవ్ అభిప్రాయపడ్డారు.
క్రెమ్లిన్.. తాజా పరిణామాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. పుతిన్ బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్లలేకపోతున్నట్టు చెబుతోంది. కానీ పుతిన్ అంత బిజీగా ఉండటానికి కారణాలను మాత్రం బయటపెట్టలేదు.
ఇదే సమయంలో.. జీ20 సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. పుతిన్కు వ్యతిరేకంగా.. దేశాధినేతల మద్దతును కూడగట్టే ప్రయత్నం ఆయన చేస్తారు. ఈ కారణంతోనే.. పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Putin Russia Ukraine war : "చెప్పడానికి పుతిన్ వద్ద ఏం లేదు. ఉక్రెయిన్కు సంబంధించి ఇరు వర్గాలను సంతోషింపజేసే విధంగా ఆయన వద్ద ప్రతిపాదనలేవీ లేవు. మరి వెళ్లడం ఎందుకు?" అని రాజకీయ విశ్లేషకుడు కాన్స్టాటిన్ కలచెవ్ పేర్కొన్నారు.
ఏది ఏమైనా.. యుద్ధం పరిణామాలతో రష్యాకే నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు జీ20 వంటి పెద్ద సదస్సుకు దూరంగా ఉండటంతో రష్యా మరింత ఒంటరి అయిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
రష్యా ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి నుంచి యుద్ధం కొనసాగుతోంది. భారీ మొత్తంలో సైనికులను ఉక్రెయిన్లోకి పంపించారు పుతిన్. ఉక్రెయిన్పై సులభంగా గెలవచ్చు అని భావించారు. కానీ ఉక్రెయిన్ ప్రతిఘటించడంతో.. రష్యా అంచనాలు తలకిందులయ్యాయని, భారీ సంఖ్యలో రష్యాకు నష్టం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
జీ20 సదస్సు..
Russia Ukraine war : ఇక 2022 జీ20 సదస్సు.. నవంబర్ 15-16 తేదీల్లో ఇండోనేషియా బాలీలో జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇండోనేషియాకు వెళ్లనున్నారు.
ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్లు పాల్గొననున్నారు.
సంబంధిత కథనం