Priyanka Gandhi Vadra: ప్రియాంక గాంధీ పిల్లలు రైహాన్, మిరాయా ల గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?-who are raihan and miraya two jewels mentioned by priyanka gandhi vadra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Priyanka Gandhi Vadra: ప్రియాంక గాంధీ పిల్లలు రైహాన్, మిరాయా ల గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

Priyanka Gandhi Vadra: ప్రియాంక గాంధీ పిల్లలు రైహాన్, మిరాయా ల గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

Sudarshan V HT Telugu

Raihan and Miraya: వయనాడ్ లోక సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. దాదాపు నాలుగు లక్షల పై చిలుకు మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఈ విజయం అనంతరం ఆమె తన భర్త, పిల్లలను గుర్తు చేసుకున్నారు. ఆమె సోదరుడు రాహుల్ గాంధీ ఖాళీ చేయడంతో వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేశారు.

ప్రియాంక గాంధీ పిల్లలు రైహాన్, మిరాయా (vadramiraya/Instagram)

Raihan and Miraya: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో 4.10 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం అనంతరం, ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆమె తన ఇద్దరు పిల్లలు రైహాన్ మరియు మిరాయాలను ప్రస్తావించారు. వారిని తన "రెండు వజ్రాలు" అని అభివర్ణించారు.

భర్త, పిల్లలకు..

‘‘నా తల్లికి, భర్త రాబర్ట్ కు, వజ్రాల్లాంటి నా ఇద్దరు పిల్లలు రైహాన్, మిరాయా లకు.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు, ధైర్యానికి ఏ కృతజ్ఞత సరిపోదు. నా అన్న రాహుల్ కి నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి... నాకు దారి చూపినందుకు, నా వెన్నుదన్నుగా నిలిచినందుకు ధన్యవాదాలు’’ అని 52 ఏళ్ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఓటర్లు రాహుల్ గాంధీకి వారసుడిగా, అతడి చెల్లి ప్రియాంక గాంధీ వాద్రాను ఎన్నుకున్నారు. అధికార వామపక్షాలు, బీజేపీ పోటీలో నిలిపిన అభ్యర్థులను ఆమె ఓడించారు.

రైహాన్, మిరాయా ఎవరు?

24 ఏళ్ల రైహాన్ ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా దంపతుల పెద్ద కుమారుడు. అతడి సోషల్ మీడియా హ్యాండిల్స్ అతడిని వృత్తిరీత్యా "విజువల్ ఆర్టిస్ట్" గా వర్ణిస్తాయి. అతడికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో కూడా ఆసక్తి ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో రైహాన్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రైహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఐదేళ్లకోసారి మార్పు తీసుకురావడానికి, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడానికి మాకు ఈ అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయాలి’’ అన్నారు.

మిరాయా ఆసక్తులు..

రైహాన్ సోదరి మిరాయా (22) డెహ్రాడూన్ లోని వెల్హామ్ గర్ల్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని. ఆమె ఇన్స్ట్రక్టర్ స్థాయి డైవింగ్ కోర్సును అభ్యసిస్తున్నట్లు సమాచారం. గతంలో
మిరాయా తన మామ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తో కలిసి భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ (priyanka gandhi) ని 2019 జనవరిలో కీలకమైన తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత మొత్తం రాష్ట్రానికి ఇంచార్జి జనరల్ సెక్రటరీగా నియమించారు.

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్

2023 డిసెంబర్లో ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ ప్రచారానికి ఆమె నేతృత్వం వహించారు. ప్రియాంక గాంధీ వాద్రా న్యూఢిల్లీలోని మోడరన్ స్కూల్ మరియు కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో చదువుకున్నారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కళాశాల నుండి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు మరియు బౌద్ధ అధ్యయనాలలో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.