Noida twin towers : ఇళ్లు కొనుగోలు చేసిన ఆ 200 కుటుంబాల పరిస్థితేంటి?
Noida twin towers demolished : నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతతో కొందరు సంబరాలు చేసుకున్నారు. కానీ చాలా మంది ఆందోళనతో భయపడిపోయారు. ఇళ్లకు డబ్బులు కట్టిన తమ పరిస్థితేంటో అర్థంకాక కుమిలిపోతున్నారు!
Noida twin towers demolished : నోయిడాలో సూపర్టెక్ ట్విన్ టవర్స్ వివాదానికి ఆదివారంతో ముగింపు పడింది! వివాదాస్పద ట్విన్ టవర్స్ను 3700 కేజీల పేలుడు పదార్థాలతో కేవలం 9 సెకన్లలో కూల్చివేశారు అధికారులు. ఆ దృశ్యాలు చూసి.. సూపర్టెక్ గ్రూప్నకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన వారందరు సంబరాలు చేసుకున్నారు. కానీ.. సూపర్టెక్ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసి.. సొంతిటి కల నెరవేర్చుకునేందుకు ఎదురుచూస్తున్న వారు.. ఆందోళనలోకి కూరుకుపోయారు.
ట్రెండింగ్ వార్తలు
ఎన్సీఆర్ పరిధిలో ఇళ్లను సొంతం చేసుకోవాలని ఆశించిన చాలా మంది.. సూపర్టెక్ గ్రూప్నకు డబ్బులు చెల్లించారు. వారిలో గురుగ్రామ్కు చెందిన అరుణ్ మిశ్రా ఒకరు.
Supertech twin towers : గురుగ్రామ్లోని సూపర్టెక్ హిల్ టౌన్ ప్రాజెక్టుకు.. 2015లో డబ్బులు చెల్లించారు అరుణ్ మిశ్రా. అప్పటి నుంచి సొంతింటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం జరిగిన పరిణామాలు చూసి.. ఆయన మనస్సు చాలా బాధపడింది.
"నోయిడా ట్విన్ టవర్స్ వ్యవహారంలో నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇక్కడ నిజమైన శిక్ష ఎవరికి పడింది? ట్విన్ టవర్స్ని కూల్చివేస్తే సరిపోతుందా? బిల్డర్ని ఎందుకు జైలుకు పంపలేదు? సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కష్టార్జితంతో ఇళ్లు కొన్నారు. ఇళ్లకి బదులు.. మానసిక ఆందోళన, రీఫండ్ కోసం అంతులేని ఎదురుచూపులే మిగిలాయి," అని మిశ్రా ఆవేదనకు గురయ్యారు.
Noida twin towers demolition video : 'ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకుని రీఫండ్ వచ్చేడట్టు చూసింది. కానీ ఆ బిల్డర్కు చెందిన ఇతర ప్రాజెక్టుల పరిస్థితేంటి? వారికి న్యాయం జరగదా? సూపర్టెక్ వద్ద నిధులు లేవు. మరి నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇతర ప్రాజెక్టుల్లో వచ్చిన డబ్బులను ఇక్కడ వాడేశారని అర్థమవుతోంది. మరి వారందరి పరిస్థితేంటి?' అని కంటతడి పెట్టుకున్నారు మిశ్రా.
మిశ్రా ఒక్కరే కాదు. ఇలా 200మంది ఉన్నారు. సూపర్టెక్కు చెందిన వివిధ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనేందుకు 200మంది డబ్బులు చెల్లించారు. వారందరు ఇప్పుడు ఆదివారం ట్విన్ టవర్స్ కూల్చివేత దృశ్యాలు చూసి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ఎందుకు?
Noida twin tower demolition reason : నోయిడాలోని సూపర్టెక్ ఎమరాల్డ్ కోర్ట్లోని హౌజింగ్ సొసైటీలో.. 14 భవనాల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రతి భవనంలో 9 ఫ్లోర్లు ఉండాలన్నది అసలు ప్రాన్. దీనికి నోయిడా అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత.. ఈ 14 టవర్స్లో.. ప్రతిదానికి 40 ఫ్లోర్లు ఉండే విధంగా డిజైన్ని సవరించారు. అందులో భాగంగానే ప్రస్తుతం కూల్చివేసిన ట్విన్ టవర్స్ను కట్టేశారు.
కాగా.. ఈ వ్యవహారంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. ఆమోదించిన దాని కన్నా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని 2012లో అలహాబాద్ కోర్టుకు వెళ్లారు. అందుకు అంగీకరించిన కోర్టు.. వాటిని తొలగించాలని 2014లో సూపర్టెక్ గ్రూప్నకు తీర్పునిచ్చింది.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం