భారత్-పాక్ కాల్పుల విరమణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పూర్తి వివరాలు..-what time will the india pakistan ceasefire begin details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్-పాక్ కాల్పుల విరమణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పూర్తి వివరాలు..

భారత్-పాక్ కాల్పుల విరమణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పూర్తి వివరాలు..

Sudarshan V HT Telugu

అమెరికా మధ్యవర్తిత్వంతో భారత, పాకిస్తాన్ లు మధ్య కాల్పుల విరమణకు అంగీకరించాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్- పాక్ మధ్య ఇటీవలి దశాబ్దాల్లో జరిగిన అత్యంత తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఇవే.

శ్రీనగర్ సమీపంలో ధ్వంసమైన డ్రోన్ శకలం (AFP)

అణ్వాయుధాలు కలిగిన రెండు పొరుగుదేశాల మధ్య వారాల తరబడి కొనసాగుతున్న ప్రాణాంతక ఘర్షణలకు ముగింపు పలుకుతూ భారత్, పాకిస్థాన్ లు పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి రానుందని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ట్రంప్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో ఈ ఒప్పందాన్ని ప్రకటించడంతో అమెరికా నేతృత్వంలో ఉన్నత స్థాయి దౌత్య చర్చల తర్వాత ఈ పురోగతి ధృవీకరించబడింది. పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను' అని ట్రంప్ ట్వీట్ చేశారు. 'కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినందుకు ఇరు దేశాలకు అభినందనలు. ఈ విషయంలో మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

భారత విదేశాంగ మంత్రికి పాక్ డీజీఎంఓ ఫోన్ కాల్

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డిజిఎంఓ) శనివారం మధ్యాహ్నం 3:35 గంటలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కి ఫోన్ చేసినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి భూమి, గగనతలం, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యను నిలిపివేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

పహల్గామ్ ఉగ్రదాడి

దశాబ్దాల్లో ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గత నెలలో పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి ఈ హింసకు దారితీసిందని న్యూఢిల్లీ ఆరోపించింది. తమ ప్రమేయాన్ని పాక్ ఖండించింది. ఫలితంగా సరిహద్దు ఘర్షణలు, డ్రోన్ దాడులు, క్షిపణి దాడుల్లో ఇరువైపులా డజన్ల కొద్దీ పౌరులు మరణించారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.