అమెరికాలో ఆపరేషన్ సింధూర్ పై బహుళ పార్టీల ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఆయన కుమారుడు ఇషాన్ థరూర్ వాషింగ్టన్ డీసీలో జరిగిన మీడియా సమావేశంలో ఒక కీలక ప్రశ్న వేశారు.
గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించిన శశిథరూర్ అండ్ టీం మంగళవారం మధ్యాహ్నం వాషింగ్టన్ చేరుకున్నారు. శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ వాషింగ్టన్ పోస్ట్ లో గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ గా పనిచేస్తూ గురువారం ఆ హోదాలో తన తండ్రిని మీడియా సమావేశంలో ఒక కీలక ప్రశ్న అడిగారు.
శశిథరూర్ ను ఆయన కుమారుడు ఇషాన్ థరూర్ ఈ కింది విధంగా ప్రశ్నించారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనడానికి రుజువులు ఉన్నాయా? అని ఏ దేశమైనా ప్రశ్నించిందా?’’ అని ఇషాన్ ప్రశ్నించారు. పాకిస్తాన్ పాత్ర ఉందని తెలిపే రుజువుల గురించి ఏ దేశమైనా మీ ప్రతినిధి బృందం నుంచి ఆధారాలు కోరిందా? అని ప్రశ్నించారు. ‘‘నాకు చాలా ఆసక్తిగా ఉంది, ఈ పర్యటనలో మీరు వివిధ దేశాలలో పర్యటించారు. ఎవరైనా పహల్గామ్ ఉగ్ర దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందనడానికి ఆధారాలు చూపించమని మిమ్మల్ని అడిగారా?’’ అని ఇషాన్ థరూర్ తన తండ్రిని ప్రశ్నించారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు కనుక, ఏవరు తమను ఆధారాలు చూపమని అడగలేదని తన కుమారుడు అడిగిన ప్రశ్నకు శశిధరూర్ సమాధానమిచ్చారు. ఉగ్ర మూకలకు పాకిస్తాన్ సహకరిస్తుందన్న విషయం అన్ని దేశాలకు స్పష్టంగా తెలుసని అన్నారు. అయితే, మీడియా మాత్రం ఈ ప్రశ్నను రెండు మూడు చోట్ల అడిగిందని ఆయన అన్నారు.
ఏ దేశం కూడా సాక్ష్యాధారాలు కోరకపోవడానికి మూడు కారణాలున్నాయని, ఈ విషయాన్ని లేవనెత్తినందుకు సంతోషంగా ఉందని శశిథరూర్ సరదాగా వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో పాక్ ప్రమేయంపై బలమైన ఆధారాలు లేకపోతే భారత్ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకునేది కాదని ఆయన అన్నారు. ఈ మూడు కారణాలను ఈ విధంగా వివరించారు.
సంబంధిత కథనం