ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా!-weather update monsoon likely to reach kerala in may on this date and expected more rainfall ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా!

ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా!

Anand Sai HT Telugu

ఈసారి రుతుపవనాలు ముందే కేరళ తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ముందుగానే రుతుపవనాలు (HT_PRINT)

వాతావరణ శాఖ నుంచి పెద్ద అప్డేట్ వచ్చింది. రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే కేరళ తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న రుతుపవనాలు రానున్నాయి. సాధారణంగా జూన్ 1 తర్వాత రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి.

ఎక్కువ వర్షపాతం

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశించి జూలై 8 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఇది సెప్టెంబర్ 17న వాయువ్య భారతదేశం నుండి వెనక్కి తగ్గడం ప్రారంభిస్తుంది. అక్టోబర్ 15 నాటికి పూర్తిగా తిరిగి వెళుతుంది. 2025 రుతుపవనాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.

ప్రీ మాన్‍‌సూన్

నాలుగు నెలల రుతుపవనాల్లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ తెలిపారు. ఈసారి ప్రీ మాన్ సూన్ యాక్టివిటీ కూడా బాగా కనిపిస్తోందన్నారు. నెల రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.

వారం ముందుగానే

ఈ సంవత్సరం రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి మే 13న మాత్రమే ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది. సాధారణంగా ఇది మే 20న జరుగుతుంది. కానీ ఈసారి అది ఒక వారం ముందుగానే జరుగుతోంది. నికోబార్ దీవుల నుండి రుతుపవనాలు కేరళకు చేరుకోవడానికి సాధారణంగా 10 రోజులు వరకు పడే అవకాశం ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.