ఓటర్ల జాబితాలో అప్డేట్ అయిన 15 రోజుల్లోగా ఓటర్లకు ఈపీఐసీ కార్డులు అందజేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సేవల పంపిణీలో సౌలభ్యం, సమర్థతతో పాటు రియల్ టైమ్ ట్రాకింగ్ ను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ఎపిక్ జనరేషన్ నుంచి తపాలా శాఖ (DoP) ద్వారా ఓటరుకు ఎపిక్ ను అందించే వరకు ప్రతి దశను రియల్ టైమ్ ట్రాకింగ్ చేయడానికి ఈ కొత్త వ్యవస్థ దోహదపడుతుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఓటర్లకు తమ ఈపీఐసీల స్థితిగతులను తెలియజేస్తూ ప్రతి దశలో ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్లు పంపిస్తారు. కొత్త వ్యవస్థను అమలు చేయడానికి, భారత ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన ఇసిఐనెట్ ప్లాట్ఫామ్ లో ప్రత్యేక ఐటి మాడ్యూల్ ను కూడా ప్రవేశపెట్టింది. కొత్త ఐటీ ప్లాట్ఫామ్ ప్రస్తుత వ్యవస్థను రీ ఇంజనీరింగ్ చేయడం ద్వారా, వర్క్ ఫ్లో ను క్రమబద్ధీకరిస్తుందని తెలిపింది.
కొత్త విధానంలో ఓటర్ల జాబితాను మార్చిన 15 రోజుల్లోనే దరఖాస్తుదారులకు ఓటరు గుర్తింపు కార్డులు అందుతాయి. ఓటర్లు పోస్టల్ శాఖ ద్వారా తమ ఓటరు గుర్తింపు కార్డు తమకు అందేవరకు ప్రతి దశను ట్రాక్ చేయవచ్చు. దరఖాస్తుదారుడు తమ అప్లికేషన్ కు సంబంధించిన ప్రతీ అప్డేట్ ను ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకుంటాడు. ఈసీ తన డెడికేటెడ్ ఐటీ మాడ్యూల్ ను తపాలా శాఖతో అనుసంధానం చేసింది. డేటా భద్రతను నిర్వహిస్తూనే సర్వీస్ డెలివరీని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఆన్ లైన్ లో ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
ఓటర్ ఐడీ కార్డు దరఖాస్తును ఆన్లైన్లో ట్రాక్ చేయడం కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
సంబంధిత కథనం