విజయ్ మాల్యా క్షమాపణలు.. భారతదేశానికి తిరిగి రావడానికి ఒక షరతు!-vijay mallya apologizes for failure of kingfisher airlines and he respond for returning to india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  విజయ్ మాల్యా క్షమాపణలు.. భారతదేశానికి తిరిగి రావడానికి ఒక షరతు!

విజయ్ మాల్యా క్షమాపణలు.. భారతదేశానికి తిరిగి రావడానికి ఒక షరతు!

Anand Sai HT Telugu

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి పాడ్‌కాస్ట్ కారణంగా వార్తల్లో నిలిచాడు. ఈ పాడ్‌కాస్ట్‌లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు.

విజయ్ మల్యా

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యానికి విజయ్ మాల్యా ఒక పాడ్‌కాస్ట్‌లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తనపై ఉన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. భారతదేశం నుండి దూరంగా ఉండటానికి గల కారణాలను సమర్థించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యానికి నేను అందరికీ క్షమాపణలు చెబుతున్నానని గురువారం పాడ్‌కాస్ట్‌లో విజయ్ మాల్యా అన్నారు.

హామీ ఇస్తే వస్తాను

ఇంకా పాడ్‌కాస్ట్‌లో విజయ్ మాల్యా మాట్లాడుతూ.. న్యాయమైన విచారణకు హామీ ఇస్తే తాను భారతదేశానికి తిరిగి రావడాన్ని పరిగణించవచ్చని అన్నారు. మాల్యా మార్చి 2016లో బ్రిటన్‌కు పారిపోయాడు. బ్రిటన్ నుంచి అప్పగించాలని భారతదేశం కోరుతోంది.

పారిపోయి రాలేదు

రుణాల ఎగవేత ఆరోపణలపై విజయ్ మాల్యా మాట్లాడుతూ.. మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవవచ్చు, కానీ నేను పారిపోలేదు. నేను భారతదేశం నుండి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చాను. కానీ నేను చట్టబద్ధంగా భావించే కారణాల వల్ల తిరిగి రాలేదు. మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు, కానీ ఇందులో 'దొంగతనం' ఎక్కడ ఉంది? అని అడిగారు.

విజయ్ మాల్యా భారత్‌కు వచ్చేందుకు దేశంలోని పలు బ్యాంకులు, ఏజెన్సీలు ఎదురు చూస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ఆయన దేశం వెలుపల ఉంటున్నారు. సరైన విచారణ, గౌరవప్రదమైన జీవితంపై తనకు భరోసా లభిస్తే భారత్ కు వచ్చే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తానని చెప్పారు. నేను తిరిగి రాకపోవడానికి నా సొంత కారణాలు ఉన్నాయని చెప్పారు.

9000 కోట్ల రూపాయల రుణం

విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు భారత బ్యాంకులు ఇచ్చిన రూ.9,000 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన 2016 నుండి యూకేలో నివసిస్తున్నారు. 2018లో మాల్యాను అప్పగించడానికి అనుకూలంగా యూకే కోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో యూకే హోం కార్యదర్శి దీనిని ఆమోదించారు. కానీ ఆ తర్వాత విజయ్ మాల్యా అప్పీల్ చేసుకున్నారు. కేసు ఇప్పుడు న్యాయస్థానంలో ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.