‘‘భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. డిస్కౌంట్ అడగకండి’’- వైరల్ గా మారిన సైన్ బోర్డ్-video shows no discount sign for india pakistan and bangladesh citizens in istanbul ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. డిస్కౌంట్ అడగకండి’’- వైరల్ గా మారిన సైన్ బోర్డ్

‘‘భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. డిస్కౌంట్ అడగకండి’’- వైరల్ గా మారిన సైన్ బోర్డ్

Sudarshan V HT Telugu

ఇస్తాంబుల్ లో దక్షిణాసియా వాసులను లక్ష్యంగా చేసుకున్న 'నో డిస్కౌంట్' నోటీసు సోషల్ మీడియా యూజర్లను ఆకర్షించింది. ఇది రేసిజం అని, దక్షిణాసియా వాసులను అవమానించడమేనని కొందరు స్పందించగా, మరికొందరు సరదా కామెంట్లు చేశారు.

వైరల్ ఇన్ స్టా పోస్ట్ (Instagram/@nawab_the_city_explorer)

ఇటీవల ఒక దుకాణం ముందు కనిపించిన ఒక సైన్ బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా షాపులో డిస్కౌంట్ అడగవద్దని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాసులను కోరుతున్నట్లుగా ఆ సైన్ బోర్డు ఉంది. ఒక యూజర్ దీనిని తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఇది నెటిజన్ల అటెన్షన్ ను పొందింది. ఈ సైన్ బోర్డ్ టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని ఒక దుకాణం ముందుది.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సోదరుల కోసం

‘భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. దయచేసి డిస్కౌంట్ అడగొద్దు’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. "ఇస్తాంబుల్ లో దక్షిణాసియా ప్రజల కోసం ప్రత్యేకంగా 'నో డిస్కౌంట్' నోటీసును నేను చూశాను" అని ఆ ఇన్ స్టా రీల్ లో ఆ యూజర్ పేర్కొన్నారు. పెయింటింగ్స్, ఇతర అలంకరణలతో పాటు కౌంటర్ సమీపంలో నోటీసును ప్రముఖంగా ప్రదర్శించడం వీడియోలో కనిపిస్తుంది.

నెటిజన్ల స్పందన

ఈ పోస్ట్ వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వారిలో చాలా మంది హాస్యభరితమైన వ్యాఖ్యలతో కామెంట్స్ విభాగాన్ని ముంచెత్తారు. ‘సోదరులారా అనడం ద్వారా ఆ మెసేజ్ ను పొలైట్ గా మార్చారు’ అని ఒక యూజర్ చమత్కరించారు. భారత్, పాక్, బంగ్లాదేశ్ లు "సరిహద్దులతో విభజించబడినా, అంతర్జాతీయంగా పొందే అవమానాలలో ఒక్కటిగా ఉంది" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది సోదరుల కోసం మాత్రమే, సోదరీమణులు డిస్కౌంట్ అడగవచ్చు" అని ఒక యూజర్ జోక్ చేశారు. మరోవైపు, భారతీయ ప్రవాసులు విదేశాల్లో తాము ఎదుర్కొన్న జాత్యహంకార అనుభవాలను పంచుకున్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.