ఇటీవల ఒక దుకాణం ముందు కనిపించిన ఒక సైన్ బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా షాపులో డిస్కౌంట్ అడగవద్దని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాసులను కోరుతున్నట్లుగా ఆ సైన్ బోర్డు ఉంది. ఒక యూజర్ దీనిని తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఇది నెటిజన్ల అటెన్షన్ ను పొందింది. ఈ సైన్ బోర్డ్ టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని ఒక దుకాణం ముందుది.
‘భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. దయచేసి డిస్కౌంట్ అడగొద్దు’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. "ఇస్తాంబుల్ లో దక్షిణాసియా ప్రజల కోసం ప్రత్యేకంగా 'నో డిస్కౌంట్' నోటీసును నేను చూశాను" అని ఆ ఇన్ స్టా రీల్ లో ఆ యూజర్ పేర్కొన్నారు. పెయింటింగ్స్, ఇతర అలంకరణలతో పాటు కౌంటర్ సమీపంలో నోటీసును ప్రముఖంగా ప్రదర్శించడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ పోస్ట్ వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వారిలో చాలా మంది హాస్యభరితమైన వ్యాఖ్యలతో కామెంట్స్ విభాగాన్ని ముంచెత్తారు. ‘సోదరులారా అనడం ద్వారా ఆ మెసేజ్ ను పొలైట్ గా మార్చారు’ అని ఒక యూజర్ చమత్కరించారు. భారత్, పాక్, బంగ్లాదేశ్ లు "సరిహద్దులతో విభజించబడినా, అంతర్జాతీయంగా పొందే అవమానాలలో ఒక్కటిగా ఉంది" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది సోదరుల కోసం మాత్రమే, సోదరీమణులు డిస్కౌంట్ అడగవచ్చు" అని ఒక యూజర్ జోక్ చేశారు. మరోవైపు, భారతీయ ప్రవాసులు విదేశాల్లో తాము ఎదుర్కొన్న జాత్యహంకార అనుభవాలను పంచుకున్నారు.
సంబంధిత కథనం