Vaishali road accident : ప్రజలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12మంది దుర్మరణం!
Vaishali road accident : అతివేగంతో దూసుకెళుతున్న ఓ ట్రక్కు.. రోడ్డు పక్కనే ఉన్న కొంతమందిపైకి దూసుకెళ్లిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోయారు.
Vaishali road accident : బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైషాలీ జిల్లాలో.. కొంతమంది ప్రజలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. బాధితులు.. రోడ్డు పక్కనే ఉన్న రావి చెట్టుకు పూజలు చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
బిహార్ రాజధాని పట్నాకు 30కి.మీల దూరంలోని దేస్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని సుల్తాన్పూర్లో కొన్ని రోజుల్లో ఓ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. వారందరు 'భూమియ బాబా'కు పూజలు చేసేందుకు బయలు దేరారు. రోడ్డు పక్కనే ఉన్న రావి చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు.
అదే సమయంలో.. మహ్నార్- హాజీపూర్ హైవేపై అతివేగంగా వెళుతున్న ఓ ట్రక్ వారిపైకి దూసుకెళ్లింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనలో ట్రక్కు డ్రైవర్ కూడా మరణించినట్టు తెలుస్తోంది.
Vaishali road accident today : ఈ ఘటన జరిగిన ప్రాంతం.. మహౌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాగా.. మహౌ ఎమ్మెల్యే ముకేశ్ రోషన్.. ఘటనస్థలానికి వెంటనే పరుగులు తీసి.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తరలివెళ్లి.. సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
"వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనలో 9మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని సదర్ హాస్పిటల్కు తరలించాము. దారి మధ్యలో మరో ముగ్గురు మరణించారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను పట్నాకు తరలించాము," అని ముకేశ్ వివరించారు.
మరోవైపు.. సుల్తాన్పూర్లో విషాదకర వాతావరణం నెలకొంది. బాధితుల కుటుంబాలు కన్నీరు పెట్టుకుంటున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ప్రధాని మోదీ.. సీఎం నితీశ్ సంతాపం..
Bihar road accident : వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.
ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
"వైషాలీలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2లక్షల పరిహారాన్ని మృతుల కుటుంబాలకు ఇస్తున్నాను. క్షతగాత్రులకు రూ. 50వేలు అందిస్తాను," అని మోదీ ట్వీట్ చేశారు.
Vaishali road accident death toll : వైషాలీ రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఘటనపై సమాచారంతో తాను దిగ్భ్రాంతికి గురైనట్టు పేర్కొన్నారు.
సంబంధిత కథనం