Uttar Pradesh rains : భారీ వర్షాలకు 48గంటల్లో 22మంది మృతి!-uttar pradesh rains 22 dead in rain related incidents in 48 hrs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Uttar Pradesh Rains, 22 Dead In Rain-related Incidents In 48 Hrs

Uttar Pradesh rains : భారీ వర్షాలకు 48గంటల్లో 22మంది మృతి!

భారీ వర్షాలకు 48గంటల్లో 22మంది మృతి!
భారీ వర్షాలకు 48గంటల్లో 22మంది మృతి! (HT_PRINT)

Uttar Pradesh rains death toll : భారీ వర్షాల కారణంగా ఉత్తర్​ప్రదేశ్​లో 48 గంటల వ్యవధిలో 22మంది ప్రాణాలు కోల్పోయారు.

Uttar Pradesh rains death toll : ఉత్తర్​ప్రదేశ్​ను వరుణుడు గడగడలాడిస్తున్నాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 48గంటల్లో ఏకంగా 22మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది.. లక్నోలో గోడ కూలిన ఘటనలో సజీవ సమాధి అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​పై వరుణుడి ప్రతాపం..

22 మరణాల్లో 13 ఉన్నావ్​లో, ఫతేహ్​పూర్​లో 3, ప్రయాగ్​రాజ్​లో 2, సీతాపూర్​, రాయ్​బరేలీ, ఝాన్సీలో తలో ఒకటి నమోదయ్యాయి.

కాగా.. లక్నోలో గోడ కూలిన ఘటనపై స్పందిస్తూ.. "దిల్​కుష ప్రాంతంలోని ఆర్మీ ఎన్​క్లేవ్​ బయట.. కొందరు కూలీలు గుడిసెల్లో జీవిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అక్కడున్న గోడ కూలిపోయింది. మాకు సమాచారం అందిన తర్వాత.. ఘటనాస్థలానికి తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు వెళ్లాము. 9 మృతదేహాలను వెలికితీశాము. ఒకరిని రక్షించాము. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు," అని జాయింట్​ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ పీయుష్​ మోర్దియా వెల్లడించారు.

కాగా.. మృతిచెందిన వారందరు ఝాన్సీ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.

Uttar Pradesh rains : లక్నోలో గోడ కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు గోలు. శిథిలాల కింద చిక్కుకున్న అతడు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం తన ఫోన్​ నుంచి పోలీసులకు ఫోన్​ చేశాడు. అనంతరం అతడిని డా. శ్యామ ప్రసాద్​ ముఖర్జీ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణమంత్రి రాజ్​నాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​, సీఎం యోగి ఆదిత్యనాథ్​లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరోవైపు.. లక్నోలో గోడ కూలిన ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది యూపీ ప్రభుత్వం. లక్నో నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం బ్రిజేష్​ పాఠక్​.. ఘటనాస్థలానికి, ఆసుపత్రికి వెళ్లారు. రోగులను పరిశీలించారు.

ఆర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం గోడ కూలిన ఘటనలు నమోదయ్యాయి.

Heavy rains in Uttar Pradesh : భారత వాతావరణశాఖ ప్రకారం.. గురువారం నుంచి ఉత్తర్​ప్రదేశ్​లో 32.2ఎంఎం సగటు వర్షపాతం నమోదైంది. ఎల్​పీఏ(లాంగ్​ పీరియడ్​ యావరేజ్​) కన్నా ఇది 428శాతం అత్యధికంగా ఉండటం గమనార్హం. ఉత్తర్​ప్రదేశ్​లోని 75జిల్లాల్లో 74.. శుక్రవారం అతిభారీ వర్షాలను చూశాయి.

బారాబంకిలో 192.7ఎంఎం, లక్నోలో 1116.9ఎంఎం, మౌలో 110ఎంఎం, బహ్రైచ్​లో 108ఎంఎం, డియోరియాలో 78.5ఎంఎం, బల్​రామ్​పూర్​లో 64ఎంఎం, బాలియాలో 63.9ఎంఎం, లఖింపూర్​ ఖేరీలో 58.7ఎంఎం, ఝాన్సీలో 51ఎంఎం, ఉన్నావ్లో 14.7ఎంఎం, ప్రయాగ్​రాజ్​లో 8.4ఎంఎం వర్షపాతం నమోదైంది.​

WhatsApp channel

సంబంధిత కథనం