US elections 2024 : కమలా హారిస్​ గెలుపు కోసం తమిళనాడులోని ఈ గ్రామంలో ప్రత్యేక పూజలు..-us presidential elections 2024 kamala harris native village in tamil nadu holds prayers for her success ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Elections 2024 : కమలా హారిస్​ గెలుపు కోసం తమిళనాడులోని ఈ గ్రామంలో ప్రత్యేక పూజలు..

US elections 2024 : కమలా హారిస్​ గెలుపు కోసం తమిళనాడులోని ఈ గ్రామంలో ప్రత్యేక పూజలు..

Sharath Chitturi HT Telugu

Kamala Harris : కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామంలో శతాబ్దం క్రితం జన్మించారు. ఇప్పుడు 2024 అధ్యక్ష ఎన్నికల్లో హారిస్​ గెలుపు కోసం అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

తులసేంద్రపురంలో కమలా హారిస్​ గెలుపు కోసం పూజలు.. (AFP)

ఇంకొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రారంభంకానుంది. కాగా, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ విజయం కోసం ఆమె స్వగ్రామం తమిళనాడులోని తులసేంద్రపురంలో ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు.

కమలా హారిస్ తాత (తల్లికి తండ్రి) పీవీ గోపాలన్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు తులసేంద్రపురం గ్రామంలో శతాబ్దం క్రితం జన్మించారు.

తులసేంద్రపురంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో, ప్రజల విరాళాల కోసం కమలా హారిస్, ఆమె తాత పేర్లను చూపించే ఒక రాయి ఉంది. ఆమె ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆలయం బయట, ఒక పెద్ద బ్యానర్​ని కూడా పెట్టారు. 

గోపాలన్, ఆయన కుటుంబం తులసేంద్రపురం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు రాజధాని చెన్నైకి వలస వెళ్లారు. అక్కడ ఆయన పదవీ విరమణ చేసే వరకు సీనియర్ ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. తరువాత జాంబియాకు మకాం మార్చి, అక్కడ భారత ప్రభుత్వంలో దౌత్యవేత్తగా పనిచేశారు. కమలా హారిస్ తల్లి శ్యామల గోపాలన్ గ్రామానికి దూరంగా పెరిగి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.

హారిస్​ గెలుపు కోసం తమిళనాడులోని తులసేంద్రపురం వాసులు ప్రార్థనలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఉపాధ్యక్షురాలు అవ్వాలని, డెమొక్రటిక్ పార్టీ విజయం కోసం నాలుగేళ్ల క్రితం తులసేంద్రపురం వాసులు ప్రార్థనలు చేసి ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఆహారాన్ని పంపిణీ చేశారు.

ఇండియాతో సంబంధాలు పెద్దగా లేనప్పటికీ, కమలా హారిస్​ తన వారసత్వాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. కుటుంబ బలం, స్ఫూర్తి కథలను వింటూ పెరిగినట్టు చెప్పారు.

"నా తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ హారిస్ 19 సంవత్సరాల వయస్సులో భారతదేశం నుంచి అమెరికాకు వచ్చారు. ఆమె నాకు, నా సోదరి మాయకు ధైర్యం- సంకల్పం గురించి నేర్పింది. ఆమె పుణ్యమా అని మిమ్మల్ని ముందుకు నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను,' అని హ్యారిస్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

కమలా హారిస్ తరచుగా తన నల్లజాతి వారసత్వం కోసం కీర్తించబడుతున్నప్పటికీ, ఆమె తన భారతీయ పూర్వీకులను, ముఖ్యంగా ఆమె తల్లి, అమ్మమ్మ ప్రభావాన్ని కూడా గుర్తిస్తారు.

"మా అమ్మ- మా అమ్మమ్మ బలం, ధైర్యానికి ప్రతిబింబం. సామాజిక న్యాయం పట్ల ఆమె నిబద్ధతను ఆమె కుటుంబం శాశ్వత ప్రభావానికి క్రెడిట్ తీసుకోవాలి," అని ఆమె తన జీవితచరిత్రలో రాశారు. సామాజిక న్యాయంలో తన పునాదులకు హారిస్​ తన కుటుంబ వారసత్వానికి ఆపాదించారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.