US Man Jailed For 100 Years : చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!
US Man Jailed For 100 Years : భారత సంతతి చిన్నారి హత్య కేసులో ఓ వ్యక్తికి 100ఏళ్ల జైలు శిక్షపడింది. 2021లో జరిగిన ఘటనకు.. బాధితురాలి కుటుంబానికి న్యాయం దక్కింది.
US Man Jailed For 100 Years : అమెరికాలోని లుజియానా రాష్ట్రంలో ఓ 35ఏళ్ల వ్యక్తికి 100ఏళ్లు జైలు శిక్ష పడింది. భారత సంతతి చిన్నారి హత్య కేసులో దోషిగా తేలిన అతడికి.. ఓ జిల్లా కోర్టు ఈ శిక్షను విధించింది.
ఇదీ జరిగింది..
అది 2021 మార్చ్ నెల.. విమల్, స్నేహల్ పటేల్ అనే భారత సంతతి దంపతులకు మాంక్హౌజ్ డ్రైవ్లో ఓ హొటల్ ఉంది. దాని పేరు సూపర్ 8 మోటెల్. ఈ దంపతులకు మియా పటేల్తో పాటు మరో సంతానం ఉంది. వీరందరు హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో నివాసముండే వారు.
US crime news : కాగా.. 2021 మార్చ్లో ష్రేవెపోర్ట్కు చెందిన జోసేఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి.. పటేల్ ఉన్న హోటల్ వద్దకు వెళ్లాడు. అక్కడి పార్కింగ్ ఏరియాలో.. మరో వ్యక్తితో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్.. తన వద్ద ఉన్న తుపాకీని తీసి ఆ వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. తుపాకీ కాల్చుడు. కానీ అది ఆ వ్యక్తిని తగలలేదు. బుల్లెట్ నుంచి అతను తప్పించుకున్నాడు. ఆ బుల్లెట్ కాస్త.. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆడుకుంటున్న మియా పటేల్ తలను తాకింది. అమె కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో మియా పటేల్ వయస్సు 5ఏళ్లు.
మియాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. 3 రోజుల పోరాటం అనంతరం 2021 మార్చ్ 23న.. మియా ప్రాణాలు విడిచింది.
100ఏళ్ల జైలు శిక్ష..
Mya Patel death news : దాదాపు మూడేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిగింది. స్మిత్ను దోషిగా తేలుస్తూ.. ఈ ఏడాది జనవరిలో కడ్డో పారిష్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా శిక్షను విధించింది.
చేసిన తప్పుకు స్మిత్ మొత్తం మీద 100ఏళ్లు జైలు శిక్షను అనుభవించనున్నాడు. ఇందులో 60ఏళ్లు కఠిన ఖారాగార శిక్ష ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ప్రొబేషన్, పెరోల్, శిక్ష తగ్గింపు వంటివి చర్యలు ఉండవు.
సంబంధిత కథనం