US layoffs : 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉఫ్​! ట్రంప్​ పనులతో రోడ్డు మీదకు ఉద్యోగులు..!-us layoffs 75k govt jobs gone 19 lakh under fire how much doge is saving ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Layoffs : 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉఫ్​! ట్రంప్​ పనులతో రోడ్డు మీదకు ఉద్యోగులు..!

US layoffs : 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉఫ్​! ట్రంప్​ పనులతో రోడ్డు మీదకు ఉద్యోగులు..!

Sharath Chitturi HT Telugu
Published Feb 15, 2025 11:10 AM IST

US layoffs: డొనాల్డ్​ ట్రంప్​- ఎలాన్​ మస్క్​ డాడ్జ్​ టీమ్​ పేరు వింటేనే అమెరికా ఫెడరల్​ ఉద్యోగులు వణికిపోతున్నారు! ఇప్పటికే 75వేల మందికిపైగా ఉద్యోగులు తమ జాబ్స్​ని కోల్పోయారు. మరో 20లక్షల మందిపై ఏ క్షణంలోనైనా ‘లేఆఫ్స్​’ పిడుగు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎలాన్​ మస్క్​- డొనాల్డ్​ ట్రంప్​..
ఎలాన్​ మస్క్​- డొనాల్డ్​ ట్రంప్​.. (REUTERS)

డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. అక్రమ వలసలు, టారీఫ్​ యుద్ధంతో ప్రపంచ దేశాలకు షాక్​ ఇస్తున్న ఆయన.. ఇప్పుడు సొంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దిగ్గజ వ్యాపారవేత్త, డాడ్జ్​ (డిపార్ట్​మెంట్​ ఆఫ్​ గవర్న్​మెంట్​ ఎఫీషియెన్సీ) హెడ్​ ఎలాన్​ మస్క్​తో కలిసి ఫెడరల్​ వర్క్​ఫోర్స్​ని అమాంతం తగ్గించేందుకు ట్రంప్​ చర్యలు చేపట్టారు. ఫలితంగా అమెరికావ్యాప్తంగా వివిధ ఫెడరల్​ డిపార్ట్​మెంట్స్​లో ప్రభుత్వ ఉద్యోగులు.. కనీవినీ ఎరుగని రీతిలో లేఆఫ్స్​ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 75వేల మంది.. ఉద్యోగాల నుంచి తప్పుకున్నట్టు, మరో 19లక్షల మందిపై ఏ క్షణంలోనైనా 'లేఆఫ్​' పిడుగు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

75వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు కట్​..

ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్​బర్గ్​ రిపోర్టు ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఎలాన్​ మస్క్​తో కలిసి పనిచేయాలని ఏజెన్సీ హెడ్స్​కి ట్రంప్​ సూచించారు. అంతేకాదు, అవసరమైతే తప్ప, కొత్త ఉద్యోగులను తీసుకోవద్దని స్పష్టం చేశారు. వైట్​హైస్​ ఫ్యాక్ట్​ షీట్​ ప్రకారం.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు వైదొలిగితే, వారి స్థానంలో ఒకరికి మించి నియమించకూడదు!

ఎఫీషియెన్సీ తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించి, డబ్బులు ఆదా చేసుకోవాలని చూస్తున్నట్టు డాడ్జ్​​ టీమ్​, ట్రంప్​ యంత్రాంగం గత కొంతకాలంగా చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగానే దాదాపు 20లక్షల మంది ఫెడరల్​ ఉద్యోగులకు 'బైఔట్​' ప్రోగ్రామ్​ ఎంచుకునే ఆప్షన్​ని ఇచ్చింది ట్రంప్​ బృందం. నిర్దిష్ట తేదీలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే, సెప్టెంబర్​ 30 వరకు సంబంధించిన జీతాలు ఇస్తామని ఆ ప్రోగ్రామ్​లో చెప్పింది. ఇప్పటివరకు 75వేల మంది ఈ ప్రోగ్రామ్​ని ఆప్ట్​ చేసుకుని ఉద్యోగాల నుంచి వైదొలిగారని సెమాఫోర్​ నివేదిక తెలిపింది. "మీరు రాజీనామా చేయకపోతే, భవిష్యత్తులో మీ ఉద్యోగాలకు 100శాతం హామీ ఉంటుందని చెప్పలేము," అని సదరు ప్రోగ్రామ్​లో రాసి ఉండటం ఇందుకు కారణం.

ఇక శుక్రవారం ఒక్కరోజే 9,500కిపైగా మంది ప్రభుత్వ ఉద్యోగాలను తొలగించినట్టు తెలుస్తోంది.

సీఐఏ సహా అమెరికాలోని వివిధ ఏజెన్సీల మొత్తం వర్క్​ఫోర్స్​లో ఇప్పటివరకు 3.7శాతం మంది రాజీనామా చేశారు. మరీ ముఖ్యంగా విద్య, చిన్న వ్యాపారాల వ్యవహారాలు, ఎనర్జీ విభాగాల్లో ప్రొబెషనరీ పీరియడ్​లో ఉన్న ఉద్యోగులు అధిక ప్రభావాన్ని ఎదుర్కొన్నారు.

అంతేకాదు ట్రంప్​ విమర్శించే వివిధ విభాగాలకు బడ్జెట్​ కూడా తగ్గిపోతున్నట్టు సమాచారం. ఫలితంగా.. ఆయా విభాగాల అధికారులు.. కాస్ట్​ కటింగ్​పై ఫోకస్​ చేస్తున్నారు. ఉద్యోగాల కోత నుంచి ప్రాజెక్ట్స్​ ఖర్చును తగ్గించడం వరకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారు.

రోజుకు ఒక బిలియన్​ డాలర్లు ఆదా!

ఓవైపు అనూహ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు బాధలో ఉంటే, మరోవైపు ఎలాన్​ మస్క్​ నేతృత్వంలోని డాడ్జ్​పై ట్రంప్​ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోజుకు 1 బిలియన్​ డాలర్లు ఆదా చేయగలిగే విధానాన్ని మస్క్​ టీమ్​ కనుగొందని చెబుతున్నారు.

"వేల బిలియన్​ డాలర్లు ఆదా చేసుకునే మార్గాన్ని ఇప్పటికే కనుగొన్నాము," అని ట్రంప్​ అన్నారు.

ఇదే విషయంపై జనవరి 29న డాడ్జ్​ వివరణ కూడా ఇచ్చింది.

"ఫెడరల్​ గవర్న్​మెంట్​కి సంబంధించిన 1 బిలియన్​ డాలర్లను డాడ్జ్​ ఆదా చేస్తోంది. అనవసరమైన పొజీషన్స్​లో రిక్రూట్​మెంట్​ ఆపేయడం, విదేశీ వ్యవస్థలకు నిధులను ఆపేయడం వంటివి ఇందులో భాగం. ఇవన్నీ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లతోనే జరుగుతున్నాయి. ఇది మంచి ప్రారంభం. దీనిని రోజుకు 3 బిలియన్​ డాలర్లకు పెంచాలి," అని డాడ్జ్​ ట్వీట్​ చేసింది.

అసలేంటి ఈ డాడ్జ్​? దీని లక్ష్యాలేంటి?

ఇందాక చెప్పినట్టు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్​ మస్క్​ నేతృత్వంలో డాడ్జ్​ని ఏర్పాటు చేశారు ట్రంప్​. ఫెడరల్​ ఏజెన్సీల్లో వర్క్​ఫోర్స్​ని తగ్గించడం ఈ డాడ్జ్​ ప్రధాన అజెండా.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.