Crime news : మహిళపై కన్నేసిన అక్క భర్త! రేప్​ చేసి చంపేసి..-up woman raped murdered by elder sisters husband who wanted to marry her ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : మహిళపై కన్నేసిన అక్క భర్త! రేప్​ చేసి చంపేసి..

Crime news : మహిళపై కన్నేసిన అక్క భర్త! రేప్​ చేసి చంపేసి..

Sharath Chitturi HT Telugu
Feb 02, 2025 08:10 AM IST

Crime news : యూపీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది! ఆ మహిళ సోదరి భర్తే నిందుతుడు! కొంతమందితో కలిసి మహిళను రేప్​ చేసిన అతను, చివరికి ఆమెను చంపేశాడు. మృతదేహాన్ని తగలబెట్టాడు.

యూపీలో దారుణం!
యూపీలో దారుణం! (PTI file photo)

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఆమె అక్క భర్త కన్నేశాడు! చివరికి, ఇతరులతో కలిసి ఆమెను రేప్​ చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

యూపీలోని బుధానా అనే ప్రాంతంలోని బవానా అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. 21ఏళ్ల మహిళ కనిపించడం లేదని.. జనవరి 23న ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని షాకింగ్​ విషయాలు తెలిశాయి.

పోలీసుల కథనం ప్రకారం.. అదృశ్యమైన మహిళకు ఒక అక్క ఉంది. ఆమె భర్త పేరు ఆశిష్​. ఇతను.. తన భార్య సోదరిపై కన్నేసాడు. తనని పెళ్లి చేసుకోవాలని వెంటపడేవాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు.

ఈ క్రమంలోనే ఆశిష్​, తన సహచరులతో కలిసి ఓ రోజు ఆ 21ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లాడు. పని మీద బయటకు వెళ్లాలని ఆమెను ఎవరూ లేని చోటకు తీసుకెళ్లాడు. అక్కడే వారందరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపేశారు.

ఆ తర్వాత.. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. మహిళ మృతదేహాన్ని కాల్చేశారు.

దర్యాప్తులో భాగంగా ఈ విషయాలను తెలుసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆశిష్​ని పట్టుకుని విచారించగా అతను నేరానికి అంగీకరించాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇంకొంతమందిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు ఘటనాస్థలానికి వెళ్లిన ఫోరెన్సీక్​ నిపుణుల బృందం కీలక ఆధారాలను సేకరించింది. ఆ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు వివరించారు.

మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటాని, అందరిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

కేఫ్​లో బాలికపై అత్యాచారం..

ముజఫర్​నగర్ జిల్లాలోని ఓ కేఫ్​లో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు!

నిందితుడు విశాల్, అతని స్నేహితుడు అంకిత్యయ కేఫ్ యజమాని అక్షయ్ శర్మలపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ రూపాలీ రావు తెలిపారు.

పదో తరగతి చదువుతున్న బాలికను కేఫ్​కు పిలిపించి విశాల్, అంకిత్​లు అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

కేఫ్​లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేఫ్ యజమానిని కూడా అరెస్టు చేసినట్లు రూపాలీ రావు తెలిపారు.

నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.