గ్రామ పంచాయతీ కూడా చేతులెత్తేసిన కేసును ఓ 'గేదె' పరిష్కరించింది!
UP viral new : యూపీలో ఓ గేదె, ఓ కేసును పరిష్కరించింది! ఇదెలా సాధ్యం? అనుకుంటున్నారా? అసలు విషయానికి వస్తే..
యూపీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. గ్రామ పంచాయతీ కూడా పరిష్కరించలేని ఓ కేసును, ఓ గేదె పరిష్కరించింది! అసలు విషయం ఏంటంటే..
ఇదీ జరిగింది..
ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్లోని రాయ్ అక్షరన్పూర్ గ్రామానికి చెందిన నంద్లాల్ సరోజ్ దగ్గర చాలా గేదెలు ఉన్నాయి. వాటిలో ఒక గేదె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. నడుచుకుంటూ, నడుచుకుంటూ పూరే హరికేశ్ గ్రామానికి వెళ్లింది. గ్రామానికి చెందిన హనుమాన్ సరోజ్ అనే వ్యక్తి, ఆ గేదెను పట్టుకున్నాడు. పెంచుకోవడం మొదలుపెట్టాడు.
కానీ తన గేదె తప్పిపోవడంతో ఆందోళనకు గురైన నంద్లాల్, దాని కోసం గాలించడం మొదలుపెట్టాడు. మూడు రోజుల తీవ్ర గాలింపు అనంతరం గేదెను హనుమాన్ దగ్గర గుర్తించాడు. ఆ గేదె తనదేనని, తిరిగి ఇచ్చాయాలని చెప్పాడు. కానీ హనుమాన్ వినలేదు. అది తన గేదె అని బుకాయించాడు. చివరికి ఈ వ్యవహారం పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్లింది.
గేదె ఎవరిది? అన్న విషయంపై గంటలు గంటలు చర్చలు జరిగాయి. కానీ ఒక ఈ సమస్యకు పరిష్కారం దక్కలేదు. ఇద్దరూ, ఆ గేదె తమదేనని పట్టుబట్టారు. ఫలితంగా గ్రామ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చూడండి:- Thief leaves note: ‘‘దొంగతనం చేసి, క్షమించమని నోట్ పెట్టి..’’-
ఈ వ్యవహారం మహేశ్గంజ్ పోలీస్ స్టేషన్కి చేరింది. జరిగినది పూర్తిగా విన్న ఎస్హెచ్ఓ శ్రవణ్ కుమార్.. సమస్యకు ఒక పరిష్కారాన్ని వివరించారు.
"గెదే ఎవరికి చెందుతుందో దానిని నిర్ణయించుకోనివ్వండి," అని అన్నారు. ఆ గేదెను పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒక రోడ్డు దగ్గరికి తీసుకెళ్లారు. నంద్లాల్, హనుమాన్లను వారివారి గ్రామాల డైరక్షన్లో నిలబడాలని అధికారులు సూచించారు.
చివరికి ఆ గేదె, నడుచుకుంటూ.. తన యజమాని నంద్లాల్వైపు వెళ్లింది. అలా, ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఉత్కంఠకు తెరపడింది. గేదె తన విశ్వాసాన్ని చాటుకుంది.
మరోవైపు గేదె తనదేనని ఇంతసేపు బుకాయించిన హనుమాన్ను పోలీసులు, గ్రామస్థులు మందలించి విడిచిపెట్టారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కథ విన్నవారందరూ అధికారి చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. గేదెను కూడా పొగుడుతున్నారు.
సంబంధిత కథనం