Police dog solves murder case : మర్డర్​ కేసును 48 గంటల్లో ఛేదించిన శునకం!-up police salutes dog who helped solve murder case within 48 hours ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Up Police Salutes Dog Who Helped Solve Murder Case Within 48 Hours

Police dog solves murder case : మర్డర్​ కేసును 48 గంటల్లో ఛేదించిన శునకం!

Sharath Chitturi HT Telugu
Oct 16, 2022 09:15 PM IST

Police dog solves murder case : యూపీ పోలీసులకు చెందిన కే9 శునకం జానీ.. మర్డర్​ కేసును 48గంటల్లో ఛేదించింది. 22కి.మీల దూరంలో ఉన్న దొంగలించిన ట్రాక్టర్​ వద్దకు పోలీసులను తీసుకెళ్లింది.

మర్డర్​ కేసును 48 గంటల్లో ఛేదించిన శునకం!
మర్డర్​ కేసును 48 గంటల్లో ఛేదించిన శునకం!

Police dog solves murder case in 48 hours : ఎక్కడ ఏం జరిగినా.. శునకాలు ఇట్టే పసిగట్టేస్తాయి! ఇక పోలీసు శునకాలకు ఈ పవర్​ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కథే 'జానీ' అనే జర్మన్​ షెపర్డ్​ది. ఈ కే9 శునకం.. 48 గంటల్లోనే ఓ మర్డర్​ మిస్టరీని ఛేదించింది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​ కస్​గంజ్​లో ఓ 15ఏళ్ల బాలుడు.. దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు.. అతడి ట్రాక్టర్​తో పాటు కొంత నగదును దోచుకుని పారిపోయారు.

ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జానీ సాయం తీసుకున్నారు. జానీ అంటే.. పోలీసు శునకం. ఇది ఒక జర్మన్​ షెపర్డ్​.

పోలీసుల నమ్మకాన్ని జానీ వమ్ము చేయలేదు. నిందితులను కేవలం 48 గంటల్లో పట్టుకుని.. అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

"మా కే9 ఆఫీసర్​ జానీకి సెల్యూట్​. ఎలాంటి క్లూస్​ లేని మర్డర్​ మిస్టరీని జానీ 48గంటల్లో ఛేదించింది. గొప్ప డిటెక్టివ్​ అని నిరూపించుకోవడంతో పాటు.. 22కిలోమీటర్ల దూరంలో పార్కు చేసిన ట్రాక్టర్​ను పసిగట్టేసింది," అని యూపీ పోలీసులు ట్వీట్​ చేశారు.

పోలీసులు ట్వీట్​ చేసిన దాంట్లో ఓ వీడియో ఉంది. వీడియోలో.. 15ఏళ్ల బాలుడి మృతదేహం, కేసును జానీ ఛేదించిన తీరుకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి.

ఈ కేసుకు సంబంధించి ఆకాశ్​ చౌహాన్​, ధీరేంద్ర, రాహుల్​ చౌహాన్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు.

పోలీసులకు సాయం చేసి, కేసును 48 గంటల్లో ఛేదించిన జానీ, దానిని చూసుకునే రామ్​ప్రకాశ్​ సింగ్​, అనురాగ్​లను యూపీ పోలీసులు అభినందించారు. లెటర్​ ఆఫ్​ అప్రీసియేషన్​ను అందించారు.

అంతేకాకుండా.. కస్​గంజ్​ ఎస్​పీ మూర్తి.. కే9 శునకానికి సెల్యూట్​ కూడా చేశారు.

జానీ కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. యూపీ పోలీసులు చేసిన ట్వీట్​ను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం