Man Kills Wife's Lover : భార్య వివాహేతర సంబంధం.. ప్రియుడిని ప్లాన్ చేసి చంపిన భర్త
UP Man Kills Wife's Lover : భార్య ప్రియుడిపై కోపం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. అతడిని చంపి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని చెత్త కుప్పలో పడేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
UP Man Kills Wife's Lover : వివాహేతర సంబంధం కారణంగా మరో ప్రాణం బలైంది. మరో భర్త నేరస్తుడయ్యాడు! భార్య ప్రియుడిని ఓ వ్యక్తి ప్లాన్ చేసి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో కలకలం సృష్టించింది. ఇంటికి పిలిపించి మరీ హత్య చేసిన ఆ వ్యక్తి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చెత్త కుప్పలో పడేశాడు.
ట్రెండింగ్ వార్తలు
అసలేం జరిగిందంటే..
ఘజియాబాద్కు చెందిన మీలాల్ ప్రజాపతికి కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ ఆడ బిడ్డ కూడా ఉంది. కాగా.. ఘజియాబాద్కు చెందిన అక్షయ్ అనే వ్యక్తితో.. ఆ మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొంతకాలం తర్వాత ఈ విషయం మీలాల్కు తెలిసింది.
Man Kills Wife's Lover : ఓ రోజు.. పని మీద బయటకు వెళ్లాడు మీలాల్. ఆ సమయంలో.. మీలాల్ ఇంటికి వెళ్లాడు అక్షయ్. ఆ మహిళ అతనికి టీ పెట్టి ఇచ్చింది. పొరపాటున ఆ టీ.. కూతురి కాలి మీద పడింది. ఆమె కాలు కాలింది. ఘటనపై సమాచారం అందుకున్న మీలాల్.. ఇంటికి వెళ్లి, కూతురిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్షయ్పై తీవ్ర కోపంతో.. అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
ప్లాన్ చేసి.. ఇంటికి పిలిపించి..!
అక్షయ్ను చంపాలని పక్కాగా ప్లాన్ చేసిన మీలాల్.. తన భార్యకు ఫోన్ చేశాడు. "కూతురి చికిత్స కోసం నేను హాస్పిటల్లోనే ఉండాలి. ఇంట్లో ఏదైనా పని ఉంటే.. అక్షయ్ని పిలిపించు," అని భార్యతో చెప్పాడు మీలాల్. భర్త ప్లాన్ గురించి తెలియక.. అక్షయ్ను ఇంటికి పిలిచింది ఆ మహిళ.
UP crime news : అక్షయ్.. మీలాల్ ఇంటికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి మీలాల్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈక్రమంలో.. పదునైన ఆయుధంతో అక్షయ్ గొంతు కోసేశాడు మీలాల్. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, సంచుల్లో మోసుకెళ్లి ఘజియాబాద్లోని చెత్త కుప్పలో పడేశాడు.
ఇలా బయటకొచ్చింది..
కొన్ని రోజుల తర్వాత.. చెత్త కుప్ప నుంచి దుర్వాస వస్తుండటం స్థానికులు గమనించారు. ఈ క్రమంలోనే ఓ సంచిలో ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న శరీర భాగాలను చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Extra marital affair crime news : ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర వివరాల ఆధారంగా.. మీలాల్ను పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారించారు. ఈ నేపథ్యంలోనే.. హత్యకు అసలైన కారణం వెలుగులోకి వచ్చింది.
సంబంధిత కథనం