UP Man kills ex girlfriend : మాజీ ప్రియురాలిని చంపి.. 6 ముక్కలుగా నరికి!
Man kills ex girlfriend : తనతో రిలేషన్లో ఉండి.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని దారుణంగా చంపాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. బావిలో పడేశాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
Man kills ex girlfriend : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ మర్డర్ కేసు తరహాలోనే మరో ఘటన చోటుచేసుకుంది! యూపీ చెందిన ఓ వ్యక్తి.. తన మాజీ ప్రియురాలని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి బావిలో పడేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడని.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
ట్రెండింగ్ వార్తలు
ఏం జరిగింది..?
ప్రిన్స్ యాదవ్ అనే వ్యక్తి ఆజామ్గఢ్లో నివాసముంటున్నాడు. కాగా.. కొన్నేళ్ల పాటు అతనికి, అదే ప్రాంతంలోని ఆరాధన అనే యువతికి అఫైర్ నడిచింది. కానీ ఆ యువతి.. ఈ ఏడాది తొలినాళ్లల్లో.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
Man chops ex girlfriend body into pieces : ఆరాధనపై ప్రిన్స్ యాదవ్ కోపం పెంచుకున్నాడు. ఆమెను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. ఈ విషయంలో ప్రిన్స్కు అతని తల్లిదండ్రులతో పాటు మరో బంధువు సర్వేశ్ కూడా సాయం చేశారు.
ఈ నెల 9న.. ఆరాధనను బైక్ మీద.. పాశ్చిమి గ్రామంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లాడు ప్రిన్స్ యాదవ్. పక్కనే ఉన్న చెరకు తోటకు ఆరాధనను తీసుకెళ్లాడు. సర్వేశ్ సాయంతో.. యువతి గొంతును నులిమి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు ప్రిన్స్ యాదవ్. అనంతరం పదునైన ఆయుధంతో మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికారు. పాలిథిన్ బ్యాగులో వేసి సమీపంలోని బావిలో పడేసి పారిపోయారు. తల భాగాన్ని మాత్రం సమీపంలోని మరో చెరువులో పడేసి అక్కడి నుంచి జారుకున్నారు.
Uttar Pradesh crime news : బావిలో మృతదేహాన్ని గుర్తించినట్టు స్థానికులు.. ఈ నెల 15న పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే.. బాధితురాలి వివరాలను సేకరించారు. ప్రిన్స్ యాదవ్ను శనివారం అరెస్ట్ చేశారు.
నిందితుడిపై కాల్పులు..
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి తలను సేకరించేందుకు.. ప్రిన్స్ యాదవ్ను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అక్కడే అతడి చేతికి దేశీయ తుపాకీ లభించింది. దానిని అడ్డం పెట్టుకుని, ప్రిన్స్ యాదవ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్.. ప్రిన్స్ను తాకింది. అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
Shraddha Walker murder case : మరోవైపు.. ప్రిన్స్ యాదవ్కు సాయం చేసిన సర్వేశ్, ప్రమిల యాదవ్, సుమన్, రాజారామ్, కళావతి, మంజు, శీలాలు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
సంబంధిత కథనం