UP Man kills ex girlfriend : మాజీ ప్రియురాలిని చంపి.. 6 ముక్కలుగా నరికి!-up man kills ex girlfriend cuts body in 6 parts police arrested the accused ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Up Man Kills Ex Girlfriend, Cuts Body In 6 Parts, Police Arrested The Accused

UP Man kills ex girlfriend : మాజీ ప్రియురాలిని చంపి.. 6 ముక్కలుగా నరికి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 21, 2022 07:18 AM IST

Man kills ex girlfriend : తనతో రిలేషన్​లో ఉండి.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని దారుణంగా చంపాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. బావిలో పడేశాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది.

మాజీ ప్రియురాలని చంపి.. 6 ముక్కలుగా నరికి!
మాజీ ప్రియురాలని చంపి.. 6 ముక్కలుగా నరికి!

Man kills ex girlfriend : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్​ మర్డర్​ కేసు తరహాలోనే మరో ఘటన చోటుచేసుకుంది! యూపీ చెందిన ఓ వ్యక్తి.. తన మాజీ ప్రియురాలని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి బావిలో పడేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడని.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

ప్రిన్స్​ యాదవ్​ అనే వ్యక్తి ఆజామ్​గఢ్​లో నివాసముంటున్నాడు. కాగా.. కొన్నేళ్ల పాటు అతనికి, అదే ప్రాంతంలోని ఆరాధన అనే యువతికి అఫైర్​ నడిచింది. కానీ ఆ యువతి.. ఈ ఏడాది తొలినాళ్లల్లో.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

Man chops ex girlfriend body into pieces : ఆరాధనపై ప్రిన్స్​ యాదవ్​ కోపం పెంచుకున్నాడు. ఆమెను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. ఈ విషయంలో ప్రిన్స్​కు అతని తల్లిదండ్రులతో పాటు మరో బంధువు సర్వేశ్​ కూడా సాయం చేశారు.

ఈ నెల 9న.. ఆరాధనను బైక్​ మీద.. పాశ్చిమి గ్రామంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లాడు ప్రిన్స్​ యాదవ్​. పక్కనే ఉన్న చెరకు తోటకు ఆరాధనను తీసుకెళ్లాడు. సర్వేశ్​ సాయంతో.. యువతి గొంతును నులిమి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు ప్రిన్స్​ యాదవ్​. అనంతరం పదునైన ఆయుధంతో మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికారు. పాలిథిన్​ బ్యాగులో వేసి సమీపంలోని బావిలో పడేసి పారిపోయారు. తల భాగాన్ని మాత్రం సమీపంలోని మరో చెరువులో పడేసి అక్కడి నుంచి జారుకున్నారు.

Uttar Pradesh crime news : బావిలో మృతదేహాన్ని గుర్తించినట్టు స్థానికులు.. ఈ నెల 15న పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే.. బాధితురాలి వివరాలను సేకరించారు. ప్రిన్స్​ యాదవ్​ను శనివారం అరెస్ట్​ చేశారు.

నిందితుడిపై కాల్పులు..

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి తలను సేకరించేందుకు.. ప్రిన్స్​ యాదవ్​ను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అక్కడే అతడి చేతికి దేశీయ తుపాకీ లభించింది. దానిని అడ్డం పెట్టుకుని, ప్రిన్స్​ యాదవ్​ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్​.. ప్రిన్స్​ను తాకింది. అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

Shraddha Walker murder case : మరోవైపు.. ప్రిన్స్​ యాదవ్​కు సాయం చేసిన సర్వేశ్​, ప్రమిల యాదవ్​, సుమన్​, రాజారామ్​, కళావతి, మంజు, శీలాలు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం