వివాహేతర బంధానికి మరో ‘భర్త’ బలి! ముక్కలు ముక్కలుగా నరికి..-up crime news mans body chopped in 6 pieces wife lover held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వివాహేతర బంధానికి మరో ‘భర్త’ బలి! ముక్కలు ముక్కలుగా నరికి..

వివాహేతర బంధానికి మరో ‘భర్త’ బలి! ముక్కలు ముక్కలుగా నరికి..

Sharath Chitturi HT Telugu

యూపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర బంధానికి మరో వ్యక్తి బలయ్యాడు! తన ప్రేమకు అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను, ఓ భార్య చంపేసింది. అనంతరం ప్రియుడితో కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. అసలేం జరిగిందంటే..

యూపీ పోలీసులు (Representational)

ఉత్తర్​ ప్రదేశ్​లో కొన్ని నెలల క్రితం కలకలం రేపిన సౌరభ్​ రాజ్​పుట్​ మర్డర్​ కేసు తరహాలో, అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బల్లియాలో ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికారు.

ఆరు భాగాలుగా కోసి.. బ్యాగుల్లో కుక్కి!

ఉత్తర్​ప్రదేశ్​ హరిపూర్​లో జీవించే 62ఏళ్ల దేవేంద్ర రామ్​ ఒక మాజీ సైనికుడు. అతని భార్య పేరు మాయ. కాగా, మాయకు వివాహేతర బంధం ఉంది. ఆమె లవర్​ పేరు అనిల్​ యాదవ్​. తమ ప్రేమకు దేవేంద్ర అడ్డుగా ఉన్నాడని, ఆ అడ్డును తొలగించుకోవాలని మాయ- అనిల్​లు భావించారు. దేవేంద్రను చంపడానికి ప్లాన్​ చేశారు.

గత శుక్రవారం రాత్రి మాయ, దేవేంద్ర తినే ఆహారంలో మత్తుమందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత, మాయ తన భర్తను చంపేసింది. అనంతరం మాయ, అనిల్​లు మృతదేహాన్ని ఆరు భాగాలుగా ముక్కలు ముక్కలు చేసి పాలిథీన్​ బ్యాగుల్లో పెట్టారు. ఎవరు గుర్తించకుండా ఉండేందుకు, ఆ బ్యాగులను వేరువేరు చోట్ల పడేశారు. ఇందుకోసం అనిల్​ యాదవ్​ సహచరులు సతీశ్​ యాదవ్​, మిథిలేష్​ యాదవ్​లు సైతం సహకరించారు.

తన భర్త కనిపించడం లేదంటూ మరుసటి రోజు, అంటే మే 10న మాయ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు రైల్వే స్టేషన్​కి వెళ్లి దేవేంద్ర, ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది.

మిస్సింగ్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సికిందరపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో పడి ఉన్న ఓ బ్యాగులో ఓ వ్యక్తి శరీర భాగం కనిపించింది. అది దేవేంద్రదే అని నిర్థరణ అయ్యింది. ఇక సోమవారం, దేవేంద్ర మొండెం కూడా అధికారులు గుర్తించారు.

ఘటనపై మర్డర్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, దేవేంద్ర భార్య మయపై అనుమానాలు పెరిగాయి. దేవేంద్ర ఫోన్​ కూడా ఇంట్లోనే ఉండటంతో మాయను విచారించారు. ఆమె నేరాన్ని అంగీకరించింది. లవ్​ ఎఫైర్​ కారణంగా మరో ప్రాణం బలైపోయిందని పోలీసులకు తెలిసింది.

ప్రేమకు అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను తానే చంపినట్టు మహిళ ఒప్పుకుంది. ఈ క్రమంలోనే అనిల్​ యాదవ్​తో పాటు అతని ఇద్దరు సహచరుల పేర్లు కూడా బయటపెట్టింది. వారందరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నేరానికి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను కోర్టులో హాజరుపరచిన పోలీసులు, అనంతరం వారిని జైలుకు తరలించారు.

ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

సౌరభ్​ రాజ్​పుట్​ మర్డర్​ కేసు..

మార్చ్​ నెలలో సౌరభ్​ రాజ్​పుట్​ అనే నేవీ అధికారిని, అతని భార్య ముస్కాన్​, తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం డ్రమ్​లో మృతదేహాన్ని పెట్టి సిమెంట్​ పోసి కప్పేసింది. ఆ తర్వాత ప్రేమికులు ఇద్దరు విహారయాత్రలకు కూడా వెళ్లారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.