షాకింగ్​! 13ఏళ్ల బాలుడి దారుణ హత్య- పోలీసులపై కాల్పులు.. నిందితులందరు మైనర్లే!-up crime news boy killed by friends for refusing to demand ransom from his family 5 minors held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  షాకింగ్​! 13ఏళ్ల బాలుడి దారుణ హత్య- పోలీసులపై కాల్పులు.. నిందితులందరు మైనర్లే!

షాకింగ్​! 13ఏళ్ల బాలుడి దారుణ హత్య- పోలీసులపై కాల్పులు.. నిందితులందరు మైనర్లే!

Sharath Chitturi HT Telugu

యూపీ బిజ్నోర్​లో దారుణ ఘటన జరిగింది! ఇంటికి ఫోన్​ చేసి డబ్బులు డిమాండ్​ చేయాలని ఓ 13ఏళ్ల బాలుడికి అతని స్నేహితులు చెప్పారు. అతను ఒప్పుకోకపోవడంతో, ఆ 13ఏళ్ల బాలుడిని చంపేశారు! నిందితులందరు మైనర్లే కావడం గమనార్హం.

13ఏళ్ల బాలుడి దారుణ హత్య

ఉత్తర్​ ప్రదేశ్​ మీరట్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది! ఇంటికి ఫోన్​ చేసి డబ్బులు అడగమని చెప్పగా, అడగకపోవడంతో ఓ 13ఏళ్ల బాలుడిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. అంతేకాదు, ఆ ఐదుగురు నిందితులు మైనర్లు కావడం గమనార్హం!

ఇదీ జరిగింది..

మీరట్​ బిజ్నోర్​లోని హుస్సేన్​పూర్​ కాలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పీ అభిషేక్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ కుమార్ కుమారుడు ఆయుష్ ఈ నెల 6న హుస్సేన్​పూర్ కాలాలోని తన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదని శివాలా కాలా పోలీస్ స్టేషన్​లో మరుసటి రోజు దీపక్ ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే దీపక్ బంధువుల్లో ఒకరికి ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​కి రూ.5 లక్షల డిమాండ్ వచ్చింది.

దర్యాప్తులో భాగంగా ఇన్​స్టాగ్రామ్ ఖాతాపై సాంకేతిక నిఘా సాయంతో పోలీసుల అదే గ్రామానికి చెందిన అనికేత్, అన్మోల్, ఆకాష్, నకుల్, ఉమేశ్ అనే ఐదుగురు అనుమానితులను గుర్తించారు.

రూ.2లక్షలు ఇస్తామంటూ ఆయుష్​ను ప్రలోభాలకు గురిచేస్తూ నిందితులు పథకం రచించారు. అందుకు ఆయుష్ నిరాకరించడంతో, ఎక్కడ తమ కుట్రను బయటపెడతాడనే భయంతో ఆ ముఠా అతడిని గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఇమ్లియా గ్రామ సమీపంలో అడవిలోని గుంతలో పూడ్చిపెట్టాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న శివాలా కాలా పోలీస్ స్టేషన్, స్వాట్ నిఘా విభాగం సంయుక్త బృందం అనుమానితులను పట్టుకునేందుకు అడవిలోకి వెళ్లింది. పోలీసులు లోపలికి వెళ్లగానే నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనికేత్ జరిపిన కాల్పుల్లో ఎస్​హెచ్​ఓ శైలేంద్ర బుల్లెట్ ప్రూఫ్ జాకెట్​ వేసుకోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఎదురుకాల్పుల్లో అనికేత్ కాలికి గాయమై పట్టుబడ్డాడని, మిగతా నలుగురు అన్మోల్, ఆకాశ్, నకుల్, ఉమేష్​లను సంఘటనా స్థలంలో అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.

ఘటనా స్థలం నుంచి ఒక నాటు తుపాకీ, రెండు ఖాళీ తూటాలు, ఒక లైవ్ కాట్రిడ్జ్, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక పారను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించాడు, కాల్ చేయడానికి నిరాకరించడంతో ఆయుష్​ను హత్య చేసినట్లు అంగీకరించాడు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.