Udaipur killing : ఉదయ్​పూర్​ ఘటన నిందితుడు.. బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాడా?-udaipur killing assailants may have plotted to infiltrate rajasthan bjp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Udaipur Killing : ఉదయ్​పూర్​ ఘటన నిందితుడు.. బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాడా?

Udaipur killing : ఉదయ్​పూర్​ ఘటన నిందితుడు.. బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాడా?

HT Telugu Desk HT Telugu
Updated Jul 02, 2022 01:22 PM IST

Udaipur killing : ఉదయ్​పూర్​ హత్య ఘటనలో నిందితుడు రియాజ్​ అట్టారి. గతంలో బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాడు! ఎవరు పిలవకపోయినా.. రాజస్థాన్​లో జరిగిన బీజేపీ కార్యక్రమాలకు వెళ్లేవాడు.

<p>రియాజ్​ అట్టారి- మహమ్మద్​ గౌస్​</p>
రియాజ్​ అట్టారి- మహమ్మద్​ గౌస్​ (HT_PRINT)

Udaipur killing : దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి ఉదయ్​పూర్​ హత్య ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకడైన రియాజ్​ అట్టారి.. గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించాడు!

దారుణ హత్య..

నుపుర్​ శర్మ వివాదంలో ఆమెకు మద్దతుగా నిలిచిన రాజస్థాన్​ ఉదయ్​పూర్​వాసి కన్నయ్య లాల్​ను గతవారం ఇద్దరు దారుణంగా హత్య చేశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. నిందితులు రియాజ్​ అట్టారి, మహమ్మద్​ గౌస్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పాక్​ ఉగ్రసంస్థలతో నిందితులకు లింక్స్​ ఉన్నట్టు వారు భావిస్తున్నారు.

అయితే.. ఈ పూర్తి వ్యవహారంపై, నిందితుల వ్యక్తిగత జీవితంపై ప్రముఖ వార్తాసంస్థ 'ఇండియా టుడే'.. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే పలు విషయాలను బయటపెట్టింది.

రాజస్థాన్​లోని బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న రియాజ్​ అట్టారీ ఫొటోలు ఇండియా టుడేకు చిక్కాయి. ఆ ఫొటోలు మూడేళ్ల కిందట తీసినవి.

2019లో సౌదీ అరేబియా- ఉమ్రా యాత్ర నుంచి తిరిగొచ్చిన రియాజ్​ను ఓ వ్యక్తి సత్కరించారు. ఆయన పేరు ఇర్షద్​ చైన్​వాలా. ఆయన రాజస్థాన్​లోని బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యుడు.

Riyaz Attari India today : బీజేపీతో చైన్​వాలాకు దశాబ్దకాలంగా పరిచయం ఉంది. ఆ ఫొటోలను చైన్​వాలా వద్ద ప్రస్తావించింది ఇండియ టూడే. రియాజ్​.. ఉదయ్​పూర్​లో జరిగే బీజేపీ కార్యక్రమాలకు హాజరయ్యేవాడని చైన్​వాలా వెల్లడించారు.

<p>చైన్​వాలా- రియాజ్​</p>
చైన్​వాలా- రియాజ్​ (India Today)

"అవును. ఆ ఫొటోలో ఉన్నది నేను. ఉమ్రా యాత్ర నుంచి తిరిగొచ్చిన రియాజ్​ను నేను స్వాగతించారు. అతను బీజేపీ కార్యక్రమాలకు వచ్చేవాడు. అతని వెంట ఎవరో ఒకరు ఉండేవారు. బీజేపీ నేత గులాబ్​ చాంద్​ కటారియాకు చెందిన ఎన్నో కార్యక్రమాలకు ఆయన వచ్చాడు," అని చైన్​వాలా జవాబిచ్చారు.

అయితే.. పిలవకుండానే రియాజ్​ అనేకమార్లు బీజేపీ కార్యక్రమాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. 'రియాజే స్వయంగా వచ్చాడు. ఎవరు పిలవకపోయే కార్యక్రమాలకు వచ్చేవాడు. పార్టీతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పేవాడు,' అని చైన్​వాలా అన్నారు.

కాగా.. తన సన్నిహితులతో ఉన్నప్పుడు.. బీజేపీపై రియాజ్​ మండిపడేవాడని, దుర్భాషలాడేవాడని తెలుస్తోంది.

Udaipur murder : మహమ్మద్​ తాహిర్​ అనే వ్యక్తి ద్వారా.. రియాజ్​ అట్టారి బీజేపీ కార్యక్రమాలకు వెళ్లేవాడు. మహమ్మద్​ తాహిర్​ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త అని చైన్​వాలా వెల్లడించారు.

తాహిర్​- రియాజ్​లు కలిసి దిగిన ఫొటోలు చాలా ఉన్నాయి. కాగా ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇండియా టుడే ప్రయత్నించింది. తాహిర్​ నివాసానికి వెళ్లింది. కానీ అతను కనిపించలేదు. అతడు.. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిసింది. అతని ఫోన్​ కూడా స్విచ్​ఆఫ్​లోనే ఉంది.

'మాకు ఎలాంటి లింకులు లేవు..'

కాగా ఇండియా టుడే ప్రచురించిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అధికారపక్షంపై కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 'ఈ విషయం బయటపడుతుంది అనేనా? కేసును వెంటనే ఎన్​ఐఏకి తరలించారు?' అని ప్రశ్నించింది. 'కన్నయ్య లాల్​ను చంపిన వ్యక్తి బీజేపీకి చెందిన వాడు' అని కాంగ్రెస్​ సీనియర్​ నేత పవన్​ ఖేరీ ట్వీట్​ చేశారు.

ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ.. నిందితుడికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. రాజస్థాన్​ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉదయ్​పూర్​ హత్య ఘటన జరిగినట్టు ఆరోపించింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.