భారత 'త్రిశూల్ ప్రహార్': ఉగ్రవాదంపై మూడు దళాల సంయుక్త దాడి!-trishul prahar unleashed india three armed forces strike terrorism in joint operation sindoor ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత 'త్రిశూల్ ప్రహార్': ఉగ్రవాదంపై మూడు దళాల సంయుక్త దాడి!

భారత 'త్రిశూల్ ప్రహార్': ఉగ్రవాదంపై మూడు దళాల సంయుక్త దాడి!

HT Telugu Desk HT Telugu

ఆపరేషన్ సిందూర్: భారతదేశం బుధవారం తెల్లవారుజామున 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మూడు దళాల (భూ, వాయు, నౌకాదళాలు) సంయుక్త ఆపరేషన్‌తో అతిపెద్ద సరిహద్దు దాడిని నిర్వహించింది.

ఆపరేషన్ సిందూర్

భారతదేశం ఉగ్రవాదంపై తన సైనిక వ్యూహాన్ని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రదర్శించింది. ఆపరేషన్ సిందూర్ కింద మొదటిసారిగా భూ, వాయు, నౌకాదళాలు ఏకమై పాకిస్తాన్ పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ఒకే రాత్రి లక్ష్యంగా చేసుకున్నాయి.

ఇది భారతదేశపు ‘త్రిశూల్ ప్రహార్’. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా, హిజ్బుల్ వంటి సంస్థల యొక్క ప్రధాన శిక్షణా శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ సాహసోపేతమైన మిషన్‌లో ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగా 90 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగింది. ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా హస్తం ఉంది. ఈ దాడికి లష్కర్ ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది.

ఈ ఆయుధాలను ఉపయోగించారు

ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం ఆధునిక మరియు సుదూర శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించింది. ఇందులో SCALP క్రూయిజ్ క్షిపణి, హామర్ బాంబులు, లోయిటరింగ్ మ్యూనిషన్ మరియు రాఫెల్ యుద్ధ విమానాలు ఉపయోగించింది.

స్కాల్ప్ క్షిపణి 250 కిమీ కంటే ఎక్కువ దూరం వరకు ఖచ్చితమైన దాడి చేయగలదు. ఈ క్షిపణి లోతైన శత్రు స్థావరాలను ధ్వంసం చేయడానికి ప్రయోగించారు. హామర్ స్మార్ట్ బాంబులు బలమైన భవనాలు మరియు బంకర్లను నాశనం చేయగలవు. దీని పరిధి 50 నుండి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.