Minor kills his own family : కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్!
Minor kills his own family : ఆ బాలుడి వయస్సు 15. బడికి వెళ్లాల్సిన వయస్సులో దారుణానికి ఒడిగట్టాడు ఆ మైనర్. తల్లితో సహా నలుగురు కుటుంబసభ్యులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది.
Minor kills his own family : త్రిపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 15ఏళ్ల బాలుడు.. సొంత కుటుంబసభ్యులను గొడ్డలితో నరికి చంపేశాడు! ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది.
ట్రెండింగ్ వార్తలు
కారణమేంటి..?
అగర్తలకు 90కి.మీల దూరంలో ఉంది కమల్పూర్. అందులోని దురై శివ్బరీ అనే ప్రాంతంలో ఓ మైనర్.. తన కుటుంబంతో నివాసముంటున్నాడు.
కాగా.. శనివారం అర్ధరాత్రి.. ఆ మైనర్ బాలుడు.. తన తాత, తల్లి, సోదరితో పాటు మరో ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి చంపేశాడు. తాత వయస్సు 70ఏళ్లు. తల్లికి 32, సోదరికి 10ఏళ్ల వయస్సు ఉంటుందని తెలుస్తోంది.
హత్య చేసిన సమయంలో.. భారీ శబ్దాలతో మ్యూజిక్ పెట్టి, కుటుంబసభ్యుల అరుపులను ఎవరికి వినిపించకుండా చేశాడు ఆ మైనర్. కుటుంబసభ్యులను చంపేసిన తర్వాత.. వారి మృతదేహాలను ఇంటి వెనుక భాగంలో పాతేశాడు ఓ బాలుడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
ఘటన జరిగిన సమయంలో బాలుడి తండ్రి ఇంట్లో లేడు. బయట నుంచి ఇంటికి తిరిగి వెళ్లేసరికి.. ఆ తండ్రికి గదుల్లో రక్తం కనిపించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ మార్కెట్లో పోలీసులు.. ఆదివారం ఉదయం నిందితుడిని పట్టుకున్నారు.
"కమల్పూర్ పోలీస్ స్టేషన్లో ఓ మర్డర్ కేసు నమోదైంది. నిందితుడిని హలాహలి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాము," అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, హత్యకు గల కారణాలను తెలుసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా.. ఇంట్లో ఆ బాలుడు దొంగతనానికి పాల్పడినట్టు తెలిసిందని అన్నారు.
ఆ బాలుడికి టీవీ చూడటం అలవాటు అని, క్రైమ్ షోలు చాలా ఎక్కువగా చూసి ఎంజయ్ చేసేవాడని.. స్థానికులు మీడియాకు వివరించారు.
సంబంధిత కథనం