ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పహల్గామ్‌కు పర్యాటకులు-tourists return to pahalgam with hope and confidence after 5 days of terrorist attack ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పహల్గామ్‌కు పర్యాటకులు

ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పహల్గామ్‌కు పర్యాటకులు

Anand Sai HT Telugu

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకులు మెల్లమెల్లగా రావడం మెుదలైంది. ఒకప్పుడు 5000-7000 మంది పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం దాడి తర్వాత 50-100 మంది పర్యాటకులకు పరిమితమైంది.

పహల్గామ్‌లో పర్యాటకులు

టీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇక కశ్మీర్‌లో పర్యాటకం గురించి కాస్త ఆందోళన మెుదలైంది. కానీ ఉగ్రదాడి జరిగిన ఐదు రోజులకే మెల్లమెల్లగా పర్యాటకులు రావడం మెుదలైంది. 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడితో దెబ్బతిన్న పహల్గామ్, కశ్మీర్ లోయలో వేసవిని ఆస్వాదించాలనుకునే పర్యాటకులతో తిరిగి పుంజుకున్నట్లు కనిపిస్తోంది,

మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత పర్యాటకుల కోసం తెరిచారు. అయితే దాడి జరిగిన గ్రౌండ్ జీరో, బైసరన్ గడ్డి మైదానం ఇప్పటికీ మూసివేసే ఉంచారు. పచ్చిక బయలు చుట్టూ ఉన్న పైన్ అడవుల నుండి ఉగ్రవాదులు వచ్చి పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తర్వాత పర్యాటక కేంద్రం దాదాపు ఖాళీ అయిపోయింది.

ఇప్పుడిప్పుడే వస్తున్న పర్యాటకులు

రోజుకు 5,000 నుండి 7,000 మంది సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ప్రస్తుతం 50 నుంచి 100 మంది మాత్రమే కనిపిస్తున్నారు. పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడిన స్థానికులకు ఉపాధి భయం పట్టుకుంది. ఆదివారం నాడు పహల్గామ్ వీధుల్లో విదేశీ, స్వదేశీ పర్యాటకులు పట్టణంలో తిరుగుతుండగా సాధారణ స్థితికి వస్తుందనే ఆశలు చిగురించాయి.

మహారాష్ట్ర నుండి వచ్చిన ఒక బృందం ట్రావెల్ ఏజెంట్లు, టూర్ గ్రూప్ మద్దతు ఉన్నందున తాము భయపడటం లేదని చెప్పారు. మనం భయపడకూడదు. ఏమి జరుగుతుందో, అదే జరుగుతుందని అన్నారు.

విదేశీయుల స్పందన

క్రొయేషియా, సెర్బియన్ పర్యాటకులు పహల్గామ్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. క్రొయేషియాకు చెందిన పర్యాటకుడు వ్లాట్కో మాట్లాడుతూ.. 'కశ్మీర్‌కు రావడం 10వ సారి. ప్రతిసారీ ఇది అద్భుతంగా ఉంటుంది. నాకు ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేస్. ఇక్కడి ప్రజల మంచి మనసు నచ్చుతుంది. నా టీమ్ చాలా సంతోషంగా ఉంది. నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను, ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. ప్రతిచోటా, ప్రజలు హలో అంటారు. భయం లేదు.' వ్లాట్కో చెప్పారు.

క్రొయేషియాకు చెందిన లిజిల్జానా ఏఎన్ఐతో మాట్లాడుతూ తాము చాలా సురక్షితంగా ఉన్నామని అన్నారు. ఇక్కడ ఉండటానికి ఎటువంటి సమస్య లేదన్నారు. క్రొయేషియాకు చెందిన మరో పర్యాటకుడు అడ్మిర్ జాహిక్ కూడా ఇలాంటి మాటలే చెప్పాడు. దాడి గురించి అడిగినప్పుడు 'నాకు ఎలాంటి భయం అనిపించలేదు. భయపడితే ఇంట్లోనే ఉండవచ్చు, కానీ అక్కడ కూడా ఏదో ఒకటి జరగవచ్చు. ఇలాంటి ఘటనలు ప్రతిచోటా జరుగుతాయి.' అని చెప్పారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.