జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్న టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా; వరుడు మాజీ ఎంపీ..-tmc mp fire brand mahua moitra 50 marries bjd leader mp pinaki misra aged 65 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్న టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా; వరుడు మాజీ ఎంపీ..

జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్న టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా; వరుడు మాజీ ఎంపీ..

Sudarshan V HT Telugu

టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ (BJD) నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పినాకి మిశ్రా, మహువా మొయిత్రా

టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జంటలో మహువా మొయిత్రా వయస్సు 50 ఏళ్లు కాగా, పినాకి మిశ్రా వయస్సు 65 సంవత్సరాలు.

మే 30న జర్మనీలో వివాహం

టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ (BJD) నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాల వివాహం జర్మనీలో మే 30వ తేదీన జరిగినట్లు సమాచారం. అయితే, ఈ వివాహం గురించి ఇటు టీఎంసీ నేతలకు కానీ, అటు బీజేడీ నేతలకు కానీ సమాచారం లేదు. అలాగే, ఈ వివాహం గురించి, వారిద్దరి నుండి అధికారిక ధృవీకరణ రాకపోయినప్పటికీ, వివాహం జర్మనీలో జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో కూడా బయటపడింది.

ఇద్దరికీ రెండో వివాహమే..

మహువా మొయిత్రా, పినాకి మిశ్రా.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మహువా మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకుంది. కానీ విబేధాల కారణంగా చివరికి ఈ జంట విడాకులు తీసుకున్నారు. మహువా ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా రెండవసారి సేవలందిస్తున్నారు. ఆమె మొదటిసారి 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడ ఆమె బిజెపి అభ్యర్థి కళ్యాణ్ చౌబేను ఓడించారు. 2024 ఎన్నికల్లో ఆమె ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి బిజెపి అభ్యర్థి అమృత రాయ్‌ను ఓడించారు.

పినాకి మిశ్రా ఎవరు?

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన పినాకి మిశ్రా బిజు జనతాదళ్ నాయకుడు. గతంలో పినాకి మిశ్రా పూరీ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. పినాకి మిశ్రా మొదట సంగీతను 1984 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిశ్రా తొలిసారి 1996 లో కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఆయన బీజేడీలో చేరారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆయన లా పూర్తి చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.