దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో 25 రైళ్లు ఆలస్యం-thick fog delays 25 trains in delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో 25 రైళ్లు ఆలస్యం

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో 25 రైళ్లు ఆలస్యం

HT Telugu Desk HT Telugu

Thick fog: దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో 25 రైళ్ల రాకపోకలకు అంతరాయం చోటుచేసుకుంది.

ఢిల్లీలో పొగ మంచు (HT_PRINT)

న్యూఢిల్లీ, జనవరి 7: ఢిల్లీని మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేయడంతో 25 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. నగరంలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఉదయం 5 నుంచి 5.30 గంటల మధ్య దట్టమైన పొగమంచు, 150 మీటర్ల కనిష్ఠ దృశ్యమానత నమోదైందని, ఉదయం 8.30 గంటలకు పశ్చిమ గాలుల కారణంగా పొగమంచు 700 మీటర్లకు పెరిగిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

సఫ్దర్ జంగ్ వద్ద కనిష్ట విజిబిలిటీ 500 మీటర్లుగా ఉందని తెలిపింది. పొగమంచు కారణంగా ఉదయం 6 గంటల వరకు మొత్తం 25 రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత సోమవారం 9.6 డిగ్రీల సెల్సియస్ నుంచి స్వల్పంగా పెరిగి 10.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని ఐఎండీ తెలిపింది. ఉదయం 8.30 గంటలకు తేమ స్థాయి 92 శాతంగా నమోదైంది.

పగటిపూట చాలా దట్టమైన పొగమంచు ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏక్యూఐ ఇలా

ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఉదయం 9 గంటలకు 303 రీడింగ్‌తో 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

0 నుంచి 50 మధ్య ఏక్యూఐని 'మంచిదిగా', 51 నుంచి 100 'సంతృప్తికరమైనదిగా', 101 నుంచి 200 'మితమైనదిగా', 201 నుంచి 300 'పేలవమైనదిగా', 301 నుంచి 400 'చాలా పేలవమైనదిగా', 401 నుంచి 500 'తీవ్రమైనది'గా పరిగణిస్తారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.