Temperature to rise in India : భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలర్ట్!
Temperature to rise in India : దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. వాయువ్య, మధ్య భారతంలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని స్పష్టం చేసింది.
Temperature to rise in India : చల్లగా ఉండాల్సిన ఫిబ్రవరిలో.. భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక రానున్న వేసవి కాలం ఇంకేంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు.. ప్రజల ఆందోళనలను మరింత పెంచే విధంగా ఓ ప్రకటన చేసింది ఐఎండీ (భారత వాతావరణశాఖ). వాయువ్య, మధ్య భారత ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో పెరుగుతాయని పేర్కొంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు కనీసం 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది.
ట్రెండింగ్ వార్తలు
అమ్మో.. ఎండ..!
"అత్యల్ప ఉష్ణోగ్రతలు కనీసం 2-3 డిగ్రీలు పెరగొచ్చు. వాయువ్య, మధ్య, మహారాష్ట్ర ప్రాంతాల్లో మరో 4-5 రోజుల పాటు ఈ పరిస్థితులు చూడొచ్చు. గుజరాత్లో మార్పులు ఉండకపోవచ్చు," అని ఐఎండీ వివరించింది.
Highest temperatures in India : ఢిల్లీలో శనివారం.. 29.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలో సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా ఇది 5 డిగ్రీలు ఎక్కువ! అత్యల్ప ఉష్ణోగ్రత 11.7 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కన్నా ఇది 1 డిగ్రీ ఎక్కువ.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తీరంలోని రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో సాధారణ ఉష్ణోగ్రతల డీవియేషన్ 5-10 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.
Temperature in Hyderabad : ఫిబ్రవరి అంటే దేశంలో శీతాకాల సమయం. కానీ గుజరాత్లోని బుజ్ ప్రాంతంలో గత వారంలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కన్నా ఇది 10 డిగ్రీలు ఎక్కువ. రాజస్థాన్ బికనీర్లో అత్యధిక ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలుగా ఉంది. జమ్ముకశ్మీర్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా డీవియేషన్ 7-9 డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది.
ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు
పంజాబ్తో పాటు 7 రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. సాధారణంగా ఈ స్థాయి ఉష్ణోగ్రతలు మార్చ్ మధ్య వారంలో నమోదవుతాయి. ఇక ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు మొత్తం మీద 10 రాష్ట్రాల్లో.. మార్చ్ తొలి వారంలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈ నెల మధ్యలోనే రికార్డ్ అవుతుండటం ఆందోళనకర విషయం.
Temperatures in Telangana : సాధారణంగా శీతాకాలంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఈ ఏడాది అలా జరగలేదు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి నుంచే పెరగడం మొదలుపెట్టాయి. రానున్న రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే నిజమైతే.. గోధుమ పంటపై భారీ ప్రభావమే పడుతుంది.