Teacher molested students : 26మంది స్టూడెంట్స్పై లైంగిక వేధింపులు.. టీచర్ అరెస్ట్!
Kerala teacher molested students : 26మంది స్టూడెంట్స్పై ఓ సీనియర్ టీచర్.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Kerala teacher molested students : కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ స్టూడెంట్స్పై ఓ సీనియర్ టీచర్.. కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
అసలేం జరిగిందంటే..
కేరళ కన్నూర్ జిల్లాలోని ఓ స్కూల్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొవిడ్ సంక్షోభం అనంతరం 2021 నవంబర్లో ఆ స్కూల్ తిరిగి తెరుచుకుంది. కాగా.. విద్యార్థులపై ఓ 52ఏళ్ల టీచర్ కన్నుపడింది. అప్పటి నుంచి దాదాపు 26మందిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక స్టూడెంట్స్ అందరు మనోవేదనకు గురయ్యారు.
teacher molested students in Kerala : తాజాగా.. ఓ విద్యార్థిని ధైర్యం చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. తాను అనుభవించిన పరిస్థితులను.. మరో టీచర్కు చెప్పుకుని విలపించింది. ఆ టీచర్.. అధికారులకు సమాచారం అందించారు.
ఈ నెల 11న.. డిస్ట్రిక్ట్ చైడ్లైన్ అథారిటీకి ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. 12న సీనియర్ టీచర్ను అరెస్ట్ చేశారు.
Kerala crime news : దర్యాప్తులో భాగంగా.. విద్యార్థినులకు కౌన్సిలింగ్ మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే వారికి షాకింగ్ విషయం తెలిసింది. తమపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెబుతూ.. 26మంది స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు.
ఘటన తీవ్రతను అర్థం చేసుకున్న అధికారులు.. సంబంధిత నిందితుడిపై 21 కేసులు వేశారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
పనిచేస్తున్న సంస్థలో లైంగిక వేధింపులు..!
Woman Molested in Gurugram : దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి గురుగ్రామ్లో వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగ్ విహార్ ఫేజ్-5లోని ఓ సంస్థలో ఓ మహిళ పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం.. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని.. సంస్థ అడ్డుకుంటోందని ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత.. కొన్ని రోజులకు మళ్లీ అదే పోలీస్ స్టేషన్కు వెళ్లింది ఆ మహిళ. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్తో పాటు మరో ముగ్గురు.. తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Gurugram crime news : ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
"శాలరీ విషయంలో సంస్థతో ఆ మహిళకు విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసింది. నిజానిజాలను తెలుసుకుని.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాము," అని ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అనిల్ కుమార్ వెల్లడించారు.
సంబంధిత కథనం