Teacher molested students : 26మంది స్టూడెంట్స్​పై లైంగిక వేధింపులు.. టీచర్​ అరెస్ట్​!-teacher in kerala arrested for molesting 26 students ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Teacher In Kerala Arrested For Molesting 26 Students

Teacher molested students : 26మంది స్టూడెంట్స్​పై లైంగిక వేధింపులు.. టీచర్​ అరెస్ట్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 15, 2023 07:57 AM IST

Kerala teacher molested students : 26మంది స్టూడెంట్స్​పై ఓ సీనియర్​ టీచర్​.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

26మంది స్టూడెంట్స్​పై లైంగిక వేధింపులు.. టీచర్​ అరెస్ట్​
26మంది స్టూడెంట్స్​పై లైంగిక వేధింపులు.. టీచర్​ అరెస్ట్​

Kerala teacher molested students : కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్​ స్టూడెంట్స్​పై ఓ సీనియర్​ టీచర్​.. కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా టీచర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగిందంటే..

కేరళ కన్నూర్​ జిల్లాలోని ఓ స్కూల్​లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొవిడ్​ సంక్షోభం అనంతరం 2021 నవంబర్​లో ఆ స్కూల్​ తిరిగి తెరుచుకుంది. కాగా.. విద్యార్థులపై ఓ 52ఏళ్ల టీచర్​ కన్నుపడింది. అప్పటి నుంచి దాదాపు 26మందిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక స్టూడెంట్స్​ అందరు మనోవేదనకు గురయ్యారు.

teacher molested students in Kerala : తాజాగా.. ఓ విద్యార్థిని ధైర్యం చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. తాను అనుభవించిన పరిస్థితులను.. మరో టీచర్​కు చెప్పుకుని విలపించింది. ఆ టీచర్​.. అధికారులకు సమాచారం అందించారు.

ఈ నెల 11న.. డిస్ట్రిక్ట్​ చైడ్​లైన్​ అథారిటీకి ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. 12న సీనియర్​ టీచర్​ను అరెస్ట్​ చేశారు.

Kerala crime news : దర్యాప్తులో భాగంగా.. విద్యార్థినులకు కౌన్సిలింగ్​ మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే వారికి షాకింగ్​ విషయం తెలిసింది. తమపై టీచర్​ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెబుతూ.. 26మంది స్టూడెంట్స్​ ఫిర్యాదు చేశారు.

ఘటన తీవ్రతను అర్థం చేసుకున్న అధికారులు.. సంబంధిత నిందితుడిపై 21 కేసులు వేశారు. అతడిని జ్యుడీషియల్​ కస్టడీకి తరలించారు.

పనిచేస్తున్న సంస్థలో లైంగిక వేధింపులు..!

Woman Molested in Gurugram : దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి గురుగ్రామ్​లో వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగ్​ విహార్​ ఫేజ్​-5లోని ఓ సంస్థలో ఓ మహిళ పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం.. ఆమె పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని.. సంస్థ అడ్డుకుంటోందని ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత.. కొన్ని రోజులకు మళ్లీ అదే పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది ఆ మహిళ. సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​తో పాటు మరో ముగ్గురు.. తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Gurugram crime news : ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

"శాలరీ విషయంలో సంస్థతో ఆ మహిళకు విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసింది. నిజానిజాలను తెలుసుకుని.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాము," అని ఉద్యోగ్​ విహార్​ పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​ఓ అనిల్​ కుమార్​ వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం