Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు-supreme court criticises election freebies says people not willing to work ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Sudarshan V HT Telugu
Published Feb 12, 2025 02:49 PM IST

Supreme Court on election freebies: ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజలకు ఉచితంగా ఆహారం, నగదు లభించడం వల్ల వారు సోమరిపోతులుగా మారుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (PTI)

Supreme Court on election freebies: ఎన్నికలకు ముందు పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఉచితంగా రేషన్, డబ్బు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడకుండా ఉండటానికి ఈ పద్ధతి అనుమతిస్తోందని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే హక్కుకు సంబంధించిన కేసును విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్నికలకు ముందు ఉచితాలు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది.

సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

"దురదృష్టవశాత్తూ, ఈ ఉచితాల కారణంగా... పని చేయడానికి ప్రజలు సుముఖంగా లేరు. వారికి ఉచిత రేషన్ అందుతోంది. వారు ఏ పనీ చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారు' అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. నిరాశ్రయులను సమాజంలో ప్రధాన స్రవంతిలో చేర్చి దేశాభివృద్ధికి దోహదపడేలా చూడాలని ధర్మాసనం అభిప్రాయపడింది. "వారి పట్ల మీ శ్రద్ధను మేము చాలా అభినందిస్తున్నాము. కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేయడం, దేశ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యులను చేయడం మరింత మంచిది కదా" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పట్టణ పేదరిక నిర్మూలన మిషన్

పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం సహా అనేక సమస్యలను పరిష్కరించడానికి పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ను ఖరారు చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేంద్రం ఈ మిషన్ ను అమలు చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని అటార్నీ జనరల్ ను కోరింది. దీనిపై ఆరు వారాల తర్వాత విచారణ జరగనుంది. రోహింగ్యా శరణార్థులకు ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.